వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోయలో పడిన బస్సు: 8మంది మృతి, 20మందికి తీవ్ర గాయాలు

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: జిల్లాలోని మారేడుమిల్లి టైగర్ క్యాంప్ వద్ద ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంల 8మంది మృతి చెందారు. మరో 20మందికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

bus accident: 8 killed

సముద్రపు అలల్లో చిక్కుకుని ఒకరి మృతి

విశాఖపట్నం: యారాడ తీరంలో చేపల వేటకు వెల్లిన గంగవరం ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు సముద్ర అలల్లో చిక్కుకుని మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.

న్యూపోర్టు పోలీసుల వివరాల ప్రకారం... గంగవరంలో నివాసం ఉంటున్న కంబాల ధనరాజు(21) తోటి మత్స్యకారులు కారి చిన్నారావు, పేర్ల విద్యాసాగర్‌, ఎమ్‌.కోటిలతో కలసి చేతివలలు, గేలాలతో చేపలు పట్టేందుకు యారాడ తీరానికి వెళ్లారు.

అక్కడున్న బండరాళ్లపై నిలబడి చేపలు పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయి.. కొట్టుకుపోయాడు. తోటి మత్స్యకారులు అతడిని తీరానికి తీసుకొచ్చే సరికి మృతి చెందాడు. కన్నకొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు నూకరాజు,పెంటమ్మ తీవ్రంగా విలపించారు.

English summary
Eight persons killed in a bus accident occurred in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X