ఘోర ప్రమాదం: లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు, ముగ్గురు మృతి
Recommended Video

నెల్లూరు: జిల్లాలోని కావలి మండలం మద్దురపాడు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోతూ ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన సామవేదం సూర్యకుమారి(65), విజయవాడకు చెందిన తాడినాడ ప్రణీత్(25), రాజమహేంద్రవరం మోరంపూడి గ్రామానికి చెందిన రామదాసు(55)లు అక్కడిక్కడే మృతి చెందారు.

ప్రమాద ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఘటనపై కేసునమోదు చేసుకున్న కావలి రూరల్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ట్రావెల్స్ బస్సు బోల్తా: పలువురికి గాయాలు
కర్నూలు జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెల్దుర్తి మండలం అల్లుగుండు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు గురువారం తెల్లవారుజామున బోల్తాపడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలుకాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications