ఆ ముగ్గుర్ని రాయలసీమ ప్రజలు తరిమికొడ్తారు: బైరెడ్డి

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమలో కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని ఈ ముగ్గురు నేతలు డిమాండ్ చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలన్న అంశంపై నాయకులు ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు.
ఈ ముగ్గురు నాయకులకు రాయలసీమ గురించి గానీ, శ్రీబాగ్ ఒప్పందం గురించి గానీ ఏమి తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం వీరు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో రాయలసీమ నుంచే ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారని గుర్తు చేశారు. 1956 వరకు ఇక్కడే రాజధాని ఉందన్న అంశం కూడా వీళ్లకు తెలియదని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు.












Click it and Unblock the Notifications