10 రోజుల్లో అసెంబ్లీకి టి నోట్: ఆర్టికల్ 3ప్రకారమే విభజన
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణపై కేబినెట్ నోట్ పది రోజుల్లో అసెంబ్లీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో తెలంగాణ నోట్ పై వాడిగావేడిగా చర్చ సాగింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించి నోట్ను పంపించే అవకాశాలున్నాయి.
తెలంగాణ నోట్ పైన అసెంబ్లీలో కేవలం చర్చ మాత్రమే జరిగి, ఓటింగ్ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజనకు కాంగ్రెసు పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. కేబినెట్ భేటీలో మంత్రులు కావూరి సాంబశివ రావు, పల్లం రాజులు నోట్ను వ్యతిరేకించారు. గంటన్నరపాటు హాట్ హాట్గా చర్చ సాగింది. అనంతరం నోట్ను ఆమోదించింది.

పోలీసులను అప్రమత్తం చేసిన కేంద్రం
తెలంగాణ నోట్ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులను కేంద్రం గురువారం అప్రమత్తం చేసింది. అన్ని ప్రాంతాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్ర పోలీసు శాఖకు సూచించినట్లుగా తెలుస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డిజిపి) ప్రసాద రావు జిల్లాలకు చెందిన ఎస్పీలు, ఐజిలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్నారు.
కేబినెట్ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ఉద్రిక్తలకు దారి తీసినా సంయమనం పాటించాలని, ఎవరిని రెచ్చగొట్టేలా వ్యవహరించవద్దని సూచించారు. ఎప్పటికప్పుడు ఐక్యకార్యాచరణ సమితి నాయకులతో, రాజకీయ నాయకులతో మాట్లాడాలని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి భద్రత దళాలు తరలి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.
72 గంటల బంద్
తెలంగాణ నోట్కు వ్యతిరేకంగా కడప జిల్లా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక 72 గంటల జిల్లా బందుకు పిలుపునిచ్చింది. కడపలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలను ఐకాస నేతలు మూసివేయించారు. నోట్ను నిరసిస్తూ కృష్ణా జిల్లాలో శుక్రవారం బందుకు పిలుపునిచ్చారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications