రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు.. భావోద్వేగ ప్రసంగం!!
చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి గత 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ఎట్టకేలకు ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చారు. చంద్రబాబు ఆరోగ్య దృష్ట్యా ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు ఇవ్వడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి నాలుగు గంటలకు చంద్రబాబు బయటకు వచ్చారు.
తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా జైలు వద్ద మోహరించి చంద్రబాబును స్వాగతించారు. చంద్రబాబు బెయిల్ పై విడుదల అవుతున్న కారణంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీగా తెలుగు తమ్ముళ్లు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. నారా లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి, నందమూరి బాలకృష్ణ తోపాటు నందమూరి కుటుంబం, నారా వారి కుటుంబం, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టిడిపి ముఖ్య నేతలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.

చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న అభిమానులు రెట్టించిన భావోద్వేగంతో చంద్రబాబును చూడడానికి ఎగబడ్డారు. జైలు నుండి బయటకు వచ్చిన చంద్రబాబు అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు టిడిపి శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు అంటూ పేర్కొన్న ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చూపించిన మద్దతు ఎప్పటికీ మరిచిపోను అన్నారు. మీరు చూపిస్తున్న అభిమానాన్ని మర్చిపోలేనని పేర్కొన్న చంద్రబాబు రోడ్డుపైకి వచ్చి మీరు తెలిపిన సంఘీభావం, నా కోసం మీరు చేసిన పూజలు ఎప్పుడు మరిచిపోను అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా, విదేశాలలోనూ తనకు సంఘీభావం చూపించారని పేర్కొన్న చంద్రబాబు, తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.
తాను చేపట్టిన విధానాల వల్ల లబ్ధి పొందిన వారంతా తనకు మద్దతు ఇచ్చారని చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు సంఘీభావం తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతును కొనియాడారు. ఎంతోమంది తన కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారని, సైబర్ టవర్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారని గుర్తు చేశారు. వారందరిని అభినందిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. 53 రోజుల జైలు జీవితంలో తాను అభివృద్ధి కోసం చేసిన పనులను, నాటి కష్టాన్ని నేమరువేసుకున్నానని అన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications