కాల్ మనీ ఇష్యూపై చంద్రబాబు భగ్గు: వడ్డీ వ్యాపారి వేధింపులకు ఆత్మహత్య, వైన్ షాపులో వ్యక్తి మృతి
విజయవాడ: విజయవాడలో వెలుగు చూసిన కాల్ మనీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఎవరినీ ఉపేక్షించరాదని ఆయన అధికారులను ఆదేశించారు. కాల్ మనీ వ్యవహారంలో విస్మయం కలిగించే విషయాలు బయటపడిన విషయం తెలిసిందే.

వడ్డీ వ్యాపారాల వేధింపులకు ఓ వ్యక్తి బలయ్యాడు. వడ్దీ వ్యాపారుల వేధింపులు తాళలేక గణేష్ అనే పాలవ్యాపారి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు అతను సూసైడ్ నోట్ రాశాడు.
వడ్డీ వ్యాపారి వద్ద రూ. 18 వడ్డీ చొప్పున లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. శనివారం రాత్రి అతను ఉరేసుకుని ఇంట్లో మరమించాడు.
ఇదిలావుంటే, ప్రకాశం జిల్లా ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ వద్ద ఓ వైన్ షాపులో మద్యం సేవించి ఓ వ్యక్తి మరణించాడు. మద్యం విక్రయించిన సూర్య వైన్స్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ వ్యక్తి కల్తీ మద్యం వల్ల మరణించాడా, గుండెపోటుతో మరణించాడా అనే విషయం తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications