వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయంగా మీకు ఇబ్బందులే: మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి నాలుగు రోజులు సెలవులు ఇచ్చినా ఇంకా సభకు రాని ప్రజాప్రతినిధుల పైనా ఆయన మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి నాలుగు రోజులు సెలవులు ఇచ్చినా ఇంకా సభకు రాని ప్రజాప్రతినిధుల పైనా ఆయన మండిపడ్డారు.

Recommended Video

Real Time Governance State Center in Amaravati, Watch | Oneindia Telugu
 చంద్రబాబు ఆగ్రహం

చంద్రబాబు ఆగ్రహం

అసెంబ్లీ సమావేశాలకు పలువురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. సోమవారం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలను తన చాంబర్‌కు పిలిపించారు. అసెంబ్లీ జరుగుతున్న తీరుపై వారి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలపై సీరియస్‌నెస్ లేకపోవడం సరికాదన్నారు.

 వారిని పిలిపించండి

వారిని పిలిపించండి

అలాగే, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు సమాచారం అందించాలని మండిపడ్డారు. వారిని వెంటనే పిలిపించాలని ఇతర నేతలను ఆదేశించారు. నాలుగు రోజులు సభకు సెలవులు ఇచ్చారని, అయినా ఇంత నిర్లక్ష్యంగా ఉండటం సరికాదన్నారు.

 కలుపుకోవాలని ఆదేశాలు

కలుపుకోవాలని ఆదేశాలు

అలాగే, ఇటీవల వైసీపి నుంచి టీడీపీలోకి మరికొంతమంది ఎమ్మెల్యేలు, నేతలు వస్తున్నారు. దీనిపై కూడా చంద్రబాబు స్పందించారు. నియోజకవర్గాల్లో కొత్త, పాత అందరూ కలుపుకొని ముందుకు సాగాలని చెప్పారు.

 గెలవకుంటే రాజకీయంగా ఇబ్బందులే

గెలవకుంటే రాజకీయంగా ఇబ్బందులే

2019 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలని చంద్రబాబు సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలవని వారు రాజకీయంగా ఇబ్బందుల్లో పడినట్లేనని వారికి వార్నింగ్ ఇచ్చారు.

English summary
AP CM Chandrababu Naidu takes class to Ministers and MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X