కోడిపందేలు: నిందితులు బయటికి.. కోళ్లు మాత్రం జైల్లోనే!
విశాఖపట్నం: పందేల్లో పాల్గొన్నాయనే నెపంతో కోళ్లను లాకప్లో పెట్టిన వింత ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. అచ్యుతాపురం మండలంలోని వివిధ గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా జరిగిన కోడిపందేలపై పోలీసులు వరుసగా దాడులు చేశారు.
ఈ దాడుల్లో ఎనిమిదిమంది నిందితులతోపాటు తొమ్మిది కోడి పుంజులను కూడా పట్టుకున్నారు. అయితే, నిందితులను వ్యక్తిగత పూచీపై విడిచిపెట్టారు. ఆ తర్వాత కోడి పుంజులను, నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు.

కాగా, మిగిలిన ప్రాంతాల్లో పట్టుకున్న కోడి పుంజులతో సహా అన్నింటినీ ఒకేసారి ప్రవేశపెట్టాలన్న కోర్టు ఆదేశాల మేరకు వీటిని తిరిగి స్టేషన్కు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో 9కోడిపుంజులు కూడా అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లోనే బంధీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications