ఒక్కరైనా ఉండాలనే: పురంధేశ్వరిపై దగ్గుబాటి, కంటతడి
ఒంగోలు: మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి భర్త, పర్చూరు శాసన సభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర రావు శుక్రవారం కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు దగ్గుబాటి శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లా కారంచేడులో కార్యకర్తలతో సమావేశమయ్యారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు చెప్పారు. అంతకుముందు కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల నుండి తప్పుకుంటున్నందుకు తనకు చాలా బాధగా ఉందని చెప్పారు. తన నిర్ణయం మీకు బాధగా అనిపించవచ్చునని, మీ ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు.

ఇంట్లో ఒకరైనా రాజకీయాలలో ఉండాలనే ఉద్దేశ్యంతో పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని చెప్పారు. తాను రాజకీయాల నుండి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నందున, పురంధేశ్వరి బిజెపిలో చేరుతున్నారని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగాలని తన పైన ఒత్తిడి తేవద్దని ఆయన కోరారు.
కాగా, రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు కార్యకర్తలతో చెబుతున్న సమయంలో దగ్గుబాటి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో కార్యకర్తలు కూడా కంటతడి పెట్టారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications