దమ్ముంటే పులివెందుల్లో ఓదార్పు: జగన్కు దేవినేని ఉమ సవాల్
హైదరాబాద్: దమ్ముంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పులివెందుల నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సవాల్ చేశారు. పులివెందులకు నీరిచ్చి చంద్రబాబు ఆదుకున్నారా, లేదా అని జగన్కు ఓదార్పు యాత్ర చేస్తే తెలుస్తుందని ఆయన శుక్రవారంనాడు అన్నారు.
ముద్దాయి జగన్ ప్రశ్నలు వేస్తే తాము సమాధానాలు చెప్తామని, ముద్దాయి ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి, ప్రజలు వినాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. వైయస్ జగన్కు సమాధానం చెప్పే సత్తా, ధైర్యం తమకు ఉన్నాయని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుట్రలను ఎదుర్కుంటామని ఉమ చెప్పారు.
కమిషన్లకు కక్కుర్తిపడి పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం చేశారని దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. ఏజెన్సీలు పోలవరం పనులను వెంటనే ప్రారంభించాలని ఆయన సూచించారు. పనులు ప్రారంభించకపోతే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోలవరం పనులను వేగవంతం చేస్తామని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్పై అవిశ్వాస నోటీసు విషయంలో నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం సభలో మాట్లాడుతూ శాసనసభలో ప్రతిపక్షం అగౌరవంగా వ్యహరిస్తోందని మండిపడ్డారు. వాకౌట్ చేస్తున్నామని చెప్పకుండానే ప్రతిపక్ష నేత జగన్ తన సహచరులతో కలిసి బయటకు వెళ్లారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
అరాచక ప్రతిపక్షం లేకపోవం వల్ల సభలో అర్థవంతమైన చర్చ జరుగుతోందని మంత్రి రావెల కిషోర్బాబు అన్నారు. శుక్రవారం శాసనసభలో మాట్లాడుతూ అయితే ప్రతిపక్షం ఉండాలని వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పీకర్ కోడెల అన్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications