ఇసుకేస్తే రాలనంతగా శబరిమలలో భక్తుల రద్దీ; నిన్న ఒక్కరోజే ఎంత మంది దర్శించుకున్నారంటే!!
కేరళలో భక్తుల సందడి కొనసాగుతుంది. ఇసుకేస్తే రాలనంత మంది జనం కేరళ అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు చేరుకున్నారు.శబరిమల అయ్యప్ప స్వామిని దర్శిచుకోవటానికి వచ్చిన భక్తులతో శబరి గిరులు కిటకిటలాడుతున్నాయి. ఇరుముడి సమర్పించేందుకు సమయం దగ్గర పడుతుండడంతో మరింత మంది భక్తులు వస్తున్నారు. దీంతో శబరిమల ప్రాంతం కిక్కిరిసిపోయింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి భక్తుల రాక భారీగా ఉన్నట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో మాలధారులు శబరిమలకు చేరుకుంటున్నారు. రద్దీ దృష్ట్యా కొందరు భక్తులు, అయ్యప్ప మాలధారులు స్వామివారిని దర్శించుకోకుండానే వెనుతిరుగుతున్నారు. ఎరుమేలిలో దాదాపు 4 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు, స్వాములు కాలినడకనే శబరిమలకు వెళ్తున్నారు.

నిన్న ఒక్కరోజే ఆదివారం నాడు శబరిమలలో అయ్యప్ప స్వామిని ఒక లక్ష 969 మంది అయ్యప్ప భక్తులు దర్శించుకున్నారు. గత పది రోజులుగా చూసుకుంటే ఆదివారం రోజు అత్యంత రద్దీ శబరిమలలో కొనసాగింది. మండల పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ముస్తాబవుతోంది. ఇప్పటికే మండల పూజ కోసం దాదాపు 2700 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇప్పటికే పోలీసులు, ఆర్ ఆర్ ఎఫ్, సిఆర్పిఎఫ్, బాంబు స్క్వాడ్, ఎన్ డీ ఆర్ ఎఫ్ సహా 2150 మంది సిబ్బంది సన్నిధానం పరిసర ప్రాంతాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. యాత్రికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడం కోసం డీఎస్పీల నేతృత్వంలో పదిమంది డిఎస్పీలు, 35 మంది ఇన్స్పెక్టర్లు 15 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఐ లతో పది డివిజన్ల పోలీసు సిబ్బందిని ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నారు.
శబరిమలకు యాత్రికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం అధికారులు మరిన్ని మౌలిక వసతుల ఏర్పాట్లపై దృష్టి సారించారు. భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా, శబరిమలకు భక్తులు తాకిడితో కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్న అధికారులు మాస్కులు ధరించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని భక్తులకు సూచనలు చేస్తున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications