వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిగ్గీ జోకర్: సోమిరెడ్డి, జగన్ కొడుకులాంటివాడుకి కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఓ జోకర్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం ధ్వజమెత్తారు. తన సొంత రాష్ట్రంలో విఫలమైన నాయకుడిని తీసుకు వచ్చి కాంగ్రెసు పార్టీ అధిష్టానం విభజనకు సిద్దపడిందని ఆరోపించారు.

తెలుగు జాతిని ఇటలీ సోనియా నాశనం చేస్తోందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్షను భగ్నం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. విభజనపై వేసిన కమిటీలో తెలుగు వారికి చోటు ఎక్కడుందని ప్రశ్నించారు. సీమాంధ్రలో ప్రజా జీవనం స్తంభించినా కేంద్రం కళ్లు తెరవదా అని ప్రశ్నించారు.

దిగ్విజయ్ లాంటి అసమర్థుడు ఉన్నంత కాలం కాంగ్రెసు పార్టీ బాగుపడదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తన కొడుకులాంటి వాడన్న డిగ్గీకి కౌంటర్ ఇచ్చారు. జగన్ ఆయనకు కొడుకులాంటి వాడే కాకుండా వారసుడు కూడా అని ఎద్దేవా చేశారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే: సురవరం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులు దీక్షలు చేస్తోందని రాజకీయ లబ్ధి కోసమేనని సురవరం సుధాకర్ రెడ్డి వేరుగా అన్నారు. కాంగ్రెసు, బిజెపియేతర కూటములతో తాము వచ్చే ఎన్నికలలో ముందుకు వెళ్తామన్నారు.

English summary
TDP senior leader Somireddy Chandramohan Reddy on Wednesday alleged that AP state incharge Digvijay Singh is a joker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X