డిగ్గీ జోకర్: సోమిరెడ్డి, జగన్ కొడుకులాంటివాడుకి కౌంటర్
తెలుగు జాతిని ఇటలీ సోనియా నాశనం చేస్తోందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్షను భగ్నం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. విభజనపై వేసిన కమిటీలో తెలుగు వారికి చోటు ఎక్కడుందని ప్రశ్నించారు. సీమాంధ్రలో ప్రజా జీవనం స్తంభించినా కేంద్రం కళ్లు తెరవదా అని ప్రశ్నించారు.
దిగ్విజయ్ లాంటి అసమర్థుడు ఉన్నంత కాలం కాంగ్రెసు పార్టీ బాగుపడదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తన కొడుకులాంటి వాడన్న డిగ్గీకి కౌంటర్ ఇచ్చారు. జగన్ ఆయనకు కొడుకులాంటి వాడే కాకుండా వారసుడు కూడా అని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే: సురవరం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులు దీక్షలు చేస్తోందని రాజకీయ లబ్ధి కోసమేనని సురవరం సుధాకర్ రెడ్డి వేరుగా అన్నారు. కాంగ్రెసు, బిజెపియేతర కూటములతో తాము వచ్చే ఎన్నికలలో ముందుకు వెళ్తామన్నారు.