జంట దారుణ హత్య: సంచీలో మహిళ శవం
ఆ సంఘటనపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైవాహికేతర సంబంధమే ఈ హత్యలకు కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
కాగా, కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎస్బిఐలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకులోకి ప్రవేశించి, తుపాకితో బెదిరించి 40 లక్షల రూపాయలు దోచుకుని వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇదిలావుంటే, రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని పుప్పాలగుడాలో ఓ ఇంట్లో సంచీలో మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
English summary
Woman and man have been killed in Karimnagar district by unidentified persons.
Story first published: Saturday, February 1, 2014, 11:44 [IST]