భూ ప్రకంపనలతో జనం పరుగులు, తప్పిన ముప్పు
ప్రకాశం జిల్లా అద్దంకి, కొరిసపాడు మండలాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారు జామున స్వల్పంగా భూ ప్రకంపనలు చోటుచేసుకొన్నాయి.అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి,
ఒంగోలు: ప్రకాశం జిల్లా అద్దంకి కొరిసపాడు మండలాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారు జామున స్వల్పంగా భూ ప్రకంపనలు చోటుచేసుకొన్నాయి.అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు చెబుతున్నారు.
సోమవారం తెల్లవారుజామున 2.43 గంటలకు సుమారు 10 సెకన్లపాటు భూమి కంపించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ భూ ప్రకంపనల కారణంగా స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

భూప్రకంపనలు మొదలు కాగానే మెలకువ వచ్చినవారంతా తమ ఇరుగు పొరుగు వారిని నిద్రలేపి ఇళ్ళ నుండి బయటకు పరుగులు తీశారు.
మళ్ళీ ఎప్పుడు ఏం జరుగుతోందనే భయంతో వారంతా తెల్లవారే వరకు నిద్రపోకుండానే భయం భయంగా గడిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications