తెలంగాణలో నోటిఫికేషన్: టిడిపి అభ్యర్థి నామినేషన్
హైదరాబాద్: తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం ఉదయం విడుదలైంది. తెలంగాణ ప్రాంతంలోని 17 లోకసభ, 119 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు (బుధవారం) ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నామినేషన్ల స్వీకరణ ఈ నెల 9వ తేదీ వరకు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలంగాణలో ఏప్రిల్ 30న, సీమాంధ్రలో మే 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నోటిఫికేషన్ విడుదలైంది. 9 వరకు నామినేషన్ల స్వీకరణ, 10వ తేదీన స్క్రూటిని ఉంటుంది. 12వ తేదీ నామినేషన్ ఉపసంహరణకు తుది గడువు.

నామినేషన్ వేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థికి పదివేల రూపాయలు, ఎంపీ అభ్యర్థికి 25వేల రూపాయలు. తెలంగాణ ప్రాంతంలో 2.70 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. పది జిల్లాల్లో 29,138 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు రూ.28 లక్షలు కాగా, ఎంపి అభ్యర్థి ఖర్చు రూ.70 లక్షలుగా ఉంది.
తెలంగాణవ్యాప్తంగా ఏప్రిల్ 30న 17 లోకసభ, 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఈ నెల 7 నుంచి ఈసి ఓటు పత్రాలను పంపిణీ చేయనుంది. కాగా, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో... బాన్సువాడ టిడిపి అభ్యర్థిగా బాద్యానాయక్ నామినేషన్ దాఖలు చేశారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications