నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భవనంపై నుంచి పడి మృతి: ఇంజనీరింగ్ విద్యార్థిని కొట్టి చంపారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: నెల్లూరు జిల్లాలోని కావలిలో గల ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థి మరణించాడు. హాస్టల్ భవనంపై నుంచి దూకి అతను మరణించాడు. విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాలలో సిఈఈ చదువుతున్న శివకుమార్ గురువారం రాత్రి భవనంపై నుంచి కిందపడిన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. తమ కుమారుడిని కొట్టి చంపారని వారు అనుమానం వ్యక్తం చేశారు. శివకుమార్ స్వగ్రామం అనంతసాగరం మండలం గొల్లపల్లి.

Engineering student commits suicide at kavali

సెల్‌ఫోన్‌పై గొడవతో విద్యార్థి ఆత్మహత్య

సెల్‌ఫోన్ విషయయంలో స్నేహితులతో గొడవపడి ఓ విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని లయోలా కాలేజీలో చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన కమల్ జైన్ లయోలా కళాశాల హాస్టల్‌లో ఉండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

గురువారంనాడు సెల్‌ఫోన్ విషయంలో అతనితో మిత్రులకు గొడవ జరిగింది. ఈ స్థితిలో తీవ్ర మనస్తాపానికి గురైన కమల్ జైన్ హాస్టల్ గదిలో ఉరేసుకుని మరణించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

English summary
An engineering student Shiva Kumar has committed suicide at Kavali in Nellore district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X