భవనంపై నుంచి పడి మృతి: ఇంజనీరింగ్ విద్యార్థిని కొట్టి చంపారా?
విజయవాడ: నెల్లూరు జిల్లాలోని కావలిలో గల ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థి మరణించాడు. హాస్టల్ భవనంపై నుంచి దూకి అతను మరణించాడు. విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాలలో సిఈఈ చదువుతున్న శివకుమార్ గురువారం రాత్రి భవనంపై నుంచి కిందపడిన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. తమ కుమారుడిని కొట్టి చంపారని వారు అనుమానం వ్యక్తం చేశారు. శివకుమార్ స్వగ్రామం అనంతసాగరం మండలం గొల్లపల్లి.

సెల్ఫోన్పై గొడవతో విద్యార్థి ఆత్మహత్య
సెల్ఫోన్ విషయయంలో స్నేహితులతో గొడవపడి ఓ విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని లయోలా కాలేజీలో చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన కమల్ జైన్ లయోలా కళాశాల హాస్టల్లో ఉండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
గురువారంనాడు సెల్ఫోన్ విషయంలో అతనితో మిత్రులకు గొడవ జరిగింది. ఈ స్థితిలో తీవ్ర మనస్తాపానికి గురైన కమల్ జైన్ హాస్టల్ గదిలో ఉరేసుకుని మరణించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications