రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నీటి పంపులో పడేసి కుమారిడిన చంపిన తండ్రి

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ఓ కసాయి తండ్రి హైదరాబాదు శివారులో అత్యంత కిరాతక చర్యకు పాల్పడ్డాడు. కుమారుడి ఉసురు తీశాడు. నిద్రిస్తున్న కొడుకును సింథటిక్ నీటి ట్యాంకులో పడేసి ప్రాణాలు తీశాడు. హైదరాబాద్ నగర శివారులోని తారామతిపేట్ గ్రామానికి చెందిన అచ్చిని శ్రీశైలం (28) గొర్రెల కాపరి. నాలుగు సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన స్వప్నను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

వారికి కుమారుడు పుట్టాడు. వారి కుమారుడు బాలమల్లేష్ (3) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూత్రపిండాలు పనిచేయకపోవడంతో రెండుసార్లు నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించారు. మూడు సంవత్సరాలుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా బాలమల్లేష్ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో శ్రీశైలం తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో శ్రీశైలం కుమారుడ్ని తీసుకెళ్ళి ఇంటి పైన ఉన్న నీటి ట్యాంకులో పడేశాడు. అనంతరం కిందికి వచ్చి తల్లికి, భార్యకు చెప్పాడు. వారు ఇంటి పైకి వెళ్ళి నీటిట్యాంకులో నుంచి బాలుడ్ని బయటకు తీశారు. అప్పటికే నీళ్లు తాగడంతో బాలమల్లేష్ మృతిచెందాడు.

విషయం తెలుసుకున్న వనస్థలిపురం ఏసీపీ ఆనంద్‌భాస్కర్, హయత్‌నగర్ సీఐ శ్రీనివాస్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని శ్రీశైలంను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary

 A father killed his son, who is suffering from illhealth in the out skirts of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X