మాజీ హోంమంత్రి సుచరిత డ్రైవర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య
అమరావతి: మాజీ హోంమంత్రి సుచరిత డ్రైవర్గా పనిచేస్తున్న చెన్నకేశవులు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరులోని బ్రాడీపేట 4వ లైనులో ఉన్న తన గదిలో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్పీ అరీఫ్ హఫీజ్.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
చెన్నకేశవులు ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. చెన్నకేశవులు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
కడప జిల్లాలోని యర్రగుంట్ల వినాయకనగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. సీనియర్ ఇంటర్ చదువు తున్న నిట్టూరు సిద్దేశ్వరి (17) సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ పరీక్షలు సమీపిస్తుండటంతో ఫెయిల్ అవుతానేమో అనే భయంతో తన కుమార్తె సిద్దేశ్వరి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప డినట్లు ఆమె తండ్రి సోమవారం ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేశా రు.
ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కాగా, సిద్దేశ్వరి ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. సిద్దేశ్వరికి తండ్రి నిట్టూ రు బాబు, తల్లి ఫాతిమా, ఇద్దరు సోదరులు ఉన్నారు.