చంద్రబాబు హ్యాట్రిక్, 16తర్వాత పవన్ కనిపించరు: గట్టు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఇక సింగపూరే గతి అని, ఆయన హ్యాట్రిక్ కొట్టబోతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచంద్ర రావు గురువారం ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు బిచాణా ఎత్తేసి సింగపూర్కు వెళ్లిపోవడం ఖాయమని, తిరిగి ఎప్పటికో కోలుకోలేని రీతిలో ఫలితాలు రాబోతున్నాయన్నారు.
ఆంధ్రాలో తమ పార్టీకి భారీ మెజార్టీ, తెలంగాణలో కింగ్ మేకర్గా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆవిర్భవిస్తుందన్నారు. సీమాంధ్రలో టిడిపి-బిజెపి మాయాకూటమి కుతంత్రాలు ఎన్నికల్లో పని చేయలేదన్నారు. సీమాంధ్రలో తమ పార్టీకి 135 అసెంబ్లీ సీట్లు, 25 లోక్సభ స్ధానాలు వస్తాయన్నారు.

ప్రజలు చంద్రబాబు, వెంకయ్య నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రసంగాలను పట్టించుకోలేదని, నమ్మలేదన్నారు. బాబుకు ఇవి చివరి ఎన్నికలన్నారు. మూడు వరుస ఓటమిలతో హ్యాట్రిక్ సాధించబోతున్నారన్నారు. బెట్టింగ్ బిజినెస్ కోసమే లగడపాటి రాజగోపాల్ సర్వేలు చేస్తున్నారన్నారు. మే 16వ తేదీ తర్వాత పవన్కళ్యాణ్ కనిపించరన్నారు.
చంద్రబాబు, వెంకయ్య, పవన్, ఎల్లో మీడియా కలిసి దుష్టచతుష్టయంగా ఏర్పడి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా పని చేయేలేదన్నారు. మోడీ, పవన్లను మెచ్చుకుంటున్న చంద్రబాబు.. ఎన్నికల ఫలితాల తర్వాత వారిని కచ్చితంగా విమర్శిస్తారన్నారు. తాను చేసే తప్పులను ఇతరులపై నెట్టడం బాబుకు అలవాటన్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications