చంద్రబాబు హ్యాట్రిక్, 16తర్వాత పవన్ కనిపించరు: గట్టు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఇక సింగపూరే గతి అని, ఆయన హ్యాట్రిక్ కొట్టబోతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచంద్ర రావు గురువారం ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు బిచాణా ఎత్తేసి సింగపూర్కు వెళ్లిపోవడం ఖాయమని, తిరిగి ఎప్పటికో కోలుకోలేని రీతిలో ఫలితాలు రాబోతున్నాయన్నారు.
ఆంధ్రాలో తమ పార్టీకి భారీ మెజార్టీ, తెలంగాణలో కింగ్ మేకర్గా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆవిర్భవిస్తుందన్నారు. సీమాంధ్రలో టిడిపి-బిజెపి మాయాకూటమి కుతంత్రాలు ఎన్నికల్లో పని చేయలేదన్నారు. సీమాంధ్రలో తమ పార్టీకి 135 అసెంబ్లీ సీట్లు, 25 లోక్సభ స్ధానాలు వస్తాయన్నారు.

ప్రజలు చంద్రబాబు, వెంకయ్య నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రసంగాలను పట్టించుకోలేదని, నమ్మలేదన్నారు. బాబుకు ఇవి చివరి ఎన్నికలన్నారు. మూడు వరుస ఓటమిలతో హ్యాట్రిక్ సాధించబోతున్నారన్నారు. బెట్టింగ్ బిజినెస్ కోసమే లగడపాటి రాజగోపాల్ సర్వేలు చేస్తున్నారన్నారు. మే 16వ తేదీ తర్వాత పవన్కళ్యాణ్ కనిపించరన్నారు.
చంద్రబాబు, వెంకయ్య, పవన్, ఎల్లో మీడియా కలిసి దుష్టచతుష్టయంగా ఏర్పడి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా పని చేయేలేదన్నారు. మోడీ, పవన్లను మెచ్చుకుంటున్న చంద్రబాబు.. ఎన్నికల ఫలితాల తర్వాత వారిని కచ్చితంగా విమర్శిస్తారన్నారు. తాను చేసే తప్పులను ఇతరులపై నెట్టడం బాబుకు అలవాటన్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications