రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ, టీడీపీలోకి వెళ్లను: జగన్ వెంటేనని విశ్వరూప్
తూర్పుగోదావరి: తాను తెలుగుదేశంలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు. శుక్రవారం అమలాపురంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలను అయినా వదులుకుంటాను గానీ, వైసీపీని మాత్రం వీడనని తేల్చి చెప్పారు.
తాను వైసీపీ నుంచి బయటకు వస్తానని, టీడీపీ నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు మైంగ్ గేమ్ ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలతో తాను ఏనాడూ సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేశారు.

ఇటువంటి దుష్ప్రచారం వల్ల తమ పార్టీ కేడర్ మానసికంగా ఇబ్బంది పడుతోందని విశ్వరూప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలను ఆయన కోరారు.
వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు విడదీయరాని సంబంధం ఉందని విశ్వరూప్ చెప్పారు. అంతేగాక, ఒకవేళ తాను రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నా వైసీపీకి విధేయుడిగానే ఉంటానని విశ్వరూప్ స్పష్టం చేశారు.
-
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు, ముహూర్తం ఫిక్స్..!! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది!












Click it and Unblock the Notifications