నేను పెద్దిరెడ్డి మనిషి, వైసీపీ చంద్రబాబును వదల్లేదు, ఇప్పుడు సీఎం వదిలేస్తారా?
జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి, గ్రామాల్లో అభివృద్ధి పనులకు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఆ జిల్లా జడ్పీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ చైర్మన్ ల పరిస్థితి మరో రకంగా తయారైయ్యిందని ఆరోపణలు ఉన్నాయి.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సొంతం జిల్లా చిత్తూరు జడ్పీలో అయితే అప్పుటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అండదండలతో చిత్తూరు జిల్లా జడ్పీని సర్వనాశనం చేశారని ఆడిటింగ్ లో వెలుగు చూడడం కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా జడ్పీలో లెక్కతేలని రూ. 19 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆడిట్ శాఖ విచారణలో వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. చిత్తూరు జిల్లా మాజీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి ఈ గోల్ మాల్ చేశాడని వెలుగు చూసింది.

జడ్పీ నిధులు సర్వసాధారణంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయాలి. అయితే అభివృద్ధి పనుల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని వెలుగు చూసింది. జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ సభ్యులకు నిధులు కేటాయించకుండా కోట్లాది రూపాయాలు దుర్వినియోగం చేశారని తెలిసింది. 2020-23లో చిత్తూరు జిల్లా జడ్పీటీసీ సమావేశాలు జరిగాయి.
ఈ సమావేశాలకు హాజరు అయిన జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ అధికారులు, వైసీపీ నాయకులు భోజనం చేయడానికి ఏకంగా రూ. 27 లక్షల రూపాయలు ఖర్చు చేశారని తెలుగు చూడడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక టెలిఫోన్ బిల్లులు, ఎయిర్ టికెట్ల కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టాలని తెలిసింది. చిత్తూరు జిల్లా జడ్పీలో సుమారు 8 కోట్ల రూపాయలకు M. బుక్కులు లేవని వెలుగు చూడడం హాట్ టాపిక్ అయ్యింది.
సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కుప్పం నియోజక వర్గంలో ఎలాంటి పనులు చేయకుండానే కోట్లాది రూపాయలు బిల్లులు సృష్టించారని, అసలు అక్కడ పనులే జరగలేదని వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా జడ్పీ మాజీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆశీస్సులతో కోట్లాది రూపాయలు మింగేశారని వెలుగు చూసింది. రూ. 20,000 రూపాయలు పైబడి ఏ వస్తువులు కొనాలన్నా టెండర్లు పిలవాలన్న నియమాలను పక్కనపెట్టి కోట్లాది రూపాయల విలువైన వస్తువులు కొనుగోలు చేశారని వెలుగు చూసింది.
ఎలాంటి టెండర్ల లేకుండా వైసీపీ నాయకులు, కార్యకర్తలకి ఆ కాంట్రాక్టు పనులు అప్పగించారని, చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయం ఆడిట్ లో వెలుగు చూడడం హాట్ టాపిక్ అయ్యింది. సుమారు రూ.19 కోట్లలకు పైగా జడ్పీ నిధులు స్వాహా చేశారని, దీనికంతటికి చిత్తూరు జడ్పీ మాజీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నాయకుల కారణమని ఆడిట్ అధికారుల విచారణలో వెలుగు చూడడం కలకలం రేపుతోంది.
అయితే వ్యవహారంలో సుమారు రూ. 19 కోట్లు గోల్ మాల్ జరిగిందని వెలుగు చూసిందని సమాచారం చిత్తూరు జడ్పీలో జరిగిన గోల్ మాల్ వ్యవహారం గురించి ఆడిట్ జరిగిందని, ఇంతకాలం జరిగిన గోల్ మాల్ వ్యవహారానికి సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తామని ఆడిట్ శాఖ సీనియర్ అధికారి గోవిందప్ప మీడియాకు చెప్పారు. చిత్తూరు జడ్పీ గోల్ మాల్ వ్యవహారానికి సంబంధించి కొందరు అధికారులు జైలుకు వెళ్లే అవకాశం ఉందని అదే జడ్పీకి చెందిన కొందరు అధికారులు అంటున్నారు.
-
BREAKING: ఏపీలో సోషల్ మీడియా బ్యాన్- నిండు అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన -
Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..! -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
నితీశ్ తర్వాత వికెట్ చంద్రబాబే? మాజీ కేంద్రమంత్రి జోస్యం..! -
YS Sharmila: బోడి 25 వేలకు మూడో బిడ్డను కనాలా ? చంద్రబాబుపై షర్మిల పంచ్..! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్!












Click it and Unblock the Notifications