వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయసుధపై జగన్ పార్టీ దాడి! ఇంటికి: డ్రైవర్ పైన చేయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాద్ కాంగ్రెసు పార్టీ శాసన సభ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే జయసుధ కాన్వాయ్ పైన శనివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జయసుధ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె మెట్టుగూడలో ఉదయం ప్రచారం ప్రారంభించారు.

ఆమె ప్రచారం చేస్తున్న సమయంలో పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జయసుధ వాహనం పైన దాడికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా నిశ్చేష్టురాలైన జయసుధ.. తన ప్రచారాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోయారు. పోలీసులు దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత చేయి చేసుకున్నారు.

Jayasudha attacked by YSRCP

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు దాడి చేసి గందరగోళం సృష్టించడంపై కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు మండిపడ్డారు. అయితే వెంటనే అక్కడే ఉన్న పోలీసులు దాడి చేసిన వారని అదుపులోకి తీసుకున్నారు.

మాదే ప్రభుత్వం: జైరాం

రానున్న సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ అరవై నుండి డెబ్బై సీట్లు గెలుచుకుంటుందని కేంద్రమంత్రి జైరాం రమేష్ అదిలాబాద్ జిల్లాలో అన్నారు. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు.

English summary
Actor turned politician Jayasudha attacked by YSR Congress Party on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X