జగన్పై ప్రశ్న: టిటిడిపై గవర్నర్కు జయసుధ ఫిర్యాదు!
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం తీరుపై కాంగ్రెసు పార్టీ సికింద్రాబాద్ శాసన సభ్యురాలు జయసుధ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనపై ఒత్తిడి చేసి డిక్లరేషన్ పైన సంతకం చేయించారన్న విషయాన్ని ఆమె గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తుల విషయంలో టిటిడి అధికారులు వివక్ష చూపుతున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల ఒకటిన తిరుమలేశుని దర్శనానికి కుటుంబ సభ్యులతో వెళ్లిన తనతో డిక్లరేషన్ మీద సంతకం చేయించుకోవడంపై ఆమె మండిపడ్డారు.

సందేహం ఉన్న వారితో డిక్లరేషన్పై సంతకాన్ని చేయించుకుంటామని తనపై అనుమానం వ్యక్తం చేయడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను పాతికేళ్లుగా తిరుమలలో దైవ దర్శనం చేసుకుంటున్నానని ఏనాడూ ఇలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదన్నారు. ప్రత్యేకంగా డిక్లరేషన్పై సంతకం చేసేందుకు జెఈవో కార్యాలయానికి రావాలని టిటిడి అధికారులు కోరడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.
ఏన్నో ఏళ్లుగా లేని సందేహం ఇప్పుడే ఎందుకు వచ్చిందని తాను అప్పుడే జెఈవో కార్యాలయ సిబ్బందిని ప్రశ్నించానని, డిక్లరేషన్ లేకుండా శ్రీవారి దర్శనానికి వెళితే అదే ప్రధాన కథనంగా ప్రసారం చేస్తారంటూ మీడియాపై జెఈవో కార్యాలయ సిబ్బంది నింద వేశారన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తున్న సమాచారం తెలిసి.. డిక్లరేషన్పై ఆయన సంతకం కూడా తీసుకుంటారా అని ప్రశ్నిస్తే... సందేహం ఉన్న అందరితోనూ డిక్లరేషన్పై సంతకాలు తీసుకుంటామని సమాధానమిచ్చారన్నారు. డిక్లరేషన్ కోసం తనను ఇబ్బంది పెట్టలేదని ఈవో గోపాల్ చెప్పడం అబద్దమన్నారు. తనకు అలాంటి ఆఫీసు ఉంటుందని కూడా తెలియదని, తనంత తానే వెళ్లి డిక్లరేషన్ ఎలా ఇస్తానన్నారు.
హెచ్చార్సీకి ఫిర్యాదు
జగన్ ఈ నెల 2న తిరుమల క్యూ కాంప్లెక్స్లోకి చెప్పులతో వెళ్లడం.. డిక్లరేషన్పై సంతకం చేయకపోవడం వంటి చర్యలతో ఒక వర్గం వారి మనోభావాలు దెబ్బతీశారంటూ తెరాస సేవక్, న్యాయవాది భార్గవ్ హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇతర మతాలవారు తిరుమల కొండపైకి వెళ్లినపుడు హిందూ విశ్వాసాలను గౌరవిస్తామని డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఉండగా.. జగన్, కొంతమంది కార్యకర్తలు అందుకు విరుద్ధంగా ప్రవర్తించి, అపరాధం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆ ఉదంతంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications