ఎంపీ స్థాయిలో ఉండి.. జీతాలు కూడా ఇవ్వరా?: కేశినేని సిబ్బంది ధర్నా
ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి జీతాలు ఎగ్గొట్టడమేంటని కేశినేని సిబ్బంది వాపోతున్నారు. వేతన బకాయిలు చెల్లించకుండా హఠాత్తుగా ట్రావెల్స్ మూసివేశామంటూ తమను ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడ: అనూహ్య నిర్ణయంతో కేశినేని ట్రావెల్స్ ను మూసివేయడంతో.. ఆ సంస్థ ఉద్యోగులంతా రోడ్డున పడ్డారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉన్న పలంగా సంస్థను మూసివేయడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. అదీ గాక ఏడాదిగా వారికి జీతాలు ఇవ్వకపోవడంతో విజయవాడలోని సంస్థ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి జీతాలు ఎగ్గొట్టడమేంటని కేశినేని సిబ్బంది వాపోతున్నారు. వేతన బకాయిలు చెల్లించకుండా హఠాత్తుగా ట్రావెల్స్ మూసివేశామంటూ తమను ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రత్యామ్నాయం చూసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా రాత్రికే రాత్రే తమను రోడ్డున నిలబెట్టారని ఉద్యోగులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.

ట్రావెల్ సిబ్బంది ఆందోళనతో ఎంపీ కేశినేని కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ అందుబాటులో లేరని, ఆయన విజయవాడ రాగానే సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్తామని ఉద్యోగులు తెలిపారు. కాగా, ఆందోళన చేస్తున్న ఉద్యోగులతో టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications