కిషన్ అలక: సికింద్రాబాద్పై పట్టు, బుజ్జగింపుతో తగ్గారు
హైదరాబాద్: సికింద్రాబాద్ లోకసభ స్థానం నుంచి బరిలోకి దిగాలని భావించిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆ స్థానం తనకు దక్కకపోవడంతో అలిగినట్లుగా తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానం ఆయనకు అంబర్పేట అసెంబ్లీ స్థానాన్ని కేటాయించింది. ఆ స్థానం నుంచి పోటీకి ఆయన ససేమిరా అని భీష్మించుకున్నారట.
కిషన్ రెడ్డికి మద్దతుగా ఆరెస్సెస్ కూడా నిలిచింది. సికింద్రాబాద్ లోకసభ స్థానం కిషన్ రెడ్డికే దక్కుతుందని అందరూ భావించారు. కానీ మంగళవారం రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్ స్థానానికి దత్తాత్రేయ పేరును ప్రకటించడంతో కిషన్ రెడ్డి మనస్థాపం చెందారంటున్నారు.

దీంతో బుధవారం ఉదయం ఆయన బి ఫారం తీసుకోవడానికి నిరాకరించారు. అంబర్పేట నుంచి కాకపోతే గోషామహల్ నుంచైనా బరిలోకి దిగాలని అగ్రనాయకులు కిషన్ రెడ్డికి సూచించారు. ఎట్టకేలకు పార్టీ ముఖ్యనేతలు బుజ్జగించడంతో చివరకు మధ్యాహ్నం 1.30 గంటలకు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వచ్చి అంబర్పేట నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
కాగా, ఇటీవల తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయమై పార్టీ అధిష్టానంతో కిషన్ రెడ్డి విభేదించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఆయన ససేమీరా అన్నారు. కానీ అధిష్టానం రెండు ప్రాంతాల్లో చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు నిర్ణయించుకుంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications