కెవిపికి అంటే ఎలా: దగ్గుబాటి ఢీ, పురంధేశ్వరిపై వివరణ

విభజనకు వ్యతిరేకంగా పోరాడిన మేం అభ్యర్థిని గెలిపిస్తే తాము అధిష్టానానికి లొంగిపోయామని ప్రజలు భావిస్తారన్నారు. తెలంగాణపై ప్రకటన వచ్చాక రాజీనామా పత్రాల పైన సంతకాలు పెట్టించింది కెవిపి రామచంద్ర రావేనని, ఇప్పుడు ఆయనకే ఓటు వేయమని చెబితే ఎలా అని ప్రశ్నించారు.
ఓటు వేసేందుకు తన మనసుకు నచ్చలేదన్నారు. సీమాంధ్రులకు అన్యాయం చేసినందువల్లే తాను తిరస్కరణ ఓటును ఉపయోగించుకున్నానని తెలిపారు. తనకు రాజకీయాలు లేకపోయినా ఫర్వాలేదని చెప్పారు. తన నిర్ణయంలో తన సతీమణి, కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అధిష్టానం తమ గొంతు పైన కత్తి పెట్టి విభజన చేస్తోందని ధ్వజమెత్తారు.
విభజన సమయంలో ముఖ్యమంత్రి రాజీనామా నాటకం ఆడుతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ వేరుగా ఆరోపించారు. ఇప్పటికైనా నాటకాలు కట్టిపెట్టి రాష్ట్ర సమైక్యతకు కృషి చేయాలని సీఎంను కోరుతున్నానన్నారు. రాజీనామా చేసి సిఎం పదవి తెలంగాణ వారికి ఇచ్చేందుకు కిరణ్ చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రం విడిపోవాలని కెసిఆర్, జగన్ కోరుకుంటున్నారని, విడిపోతేనే వారికి లాభమన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications