'ఆ ఒక్కడే.. చంద్రబాబు సంగతి తేలుస్తాడు, ఆరోజు కోసమే ఎదురుచూపు'
విజయవాడ : ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు స్టే తెచ్చుకోవడం పట్ల లక్ష్మీ పార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై స్పందించిన లక్ష్మీ పార్వతి.. చంద్రబాబు పాపం పండే రోజు దగ్గరలోనే ఉందన్నారు. చంద్రబాబు సంగతి తేల్చేందుకు 'ఎవడో ఒక్కడు ఖచ్చితంగా వస్తాడని, ఆ ఒక్కడి కోసమే.. ఆరోజు కోసమే తాను నిరీక్షిస్తున్నానని' చెప్పారు.

ప్రపంచం మొత్తంలో చంద్రబాబును మించిన అవినీతిపరుడు ఇంకెక్కడా లేడని, ఓటుకు నోటులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని మండిపడ్డారు లక్ష్మీ పార్వతి. వంద శవాలను పీక్కుతిన్న రాబందు సైతం ఒక్క గాలివానకు నేల కూలుతుందని.. అదే తరహాలో చంద్రబాబుకు పాపం పండే రోజు చేరువలోనే ఉందని కామెంట్ చేశారు.
ప్రతీ కేసులోను స్టే తెచ్చుకుని విచారణ నుంచి తప్పించుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్న లక్ష్మీ పార్వతి.. చంద్రబాబు అక్రమ ఆస్తులపై తాను కోర్టులో కేసు వేస్తే.. దానిపై కూడా చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని అన్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications