Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రాదేశికం: సీమాంధ్రలో టిడిపి, టీలో కాంగ్రెసు ముందంజ

AP Map
హైదరాబాద్: జిల్లా పరిషత్ ప్రాదేశిక సంఘాలు (జడ్పీటిసి), మండల పరిషత్ ప్రాదేశిక సంఘాల (ఎంపిటిసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని 1093 జడ్పీటిసిలకు, 16214 ఎంపిటీసిలకు ఎన్నికలు జరిగాయి. 346 ఎంపిటీసిలు ఏకగ్రీవమయ్యాయి.

ఎంపిటిసీ ఫలితాల్లో కూడా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత కనబరుస్తోంది.

ఎంపిటిసి ఫలితాల్లో తెలంగాణలో కాంగ్రెసు ముందంజలో ఉంది. టిడిపి ఉనికిని చాటుకుంటోంది.

ఆంధ్రప్రదేశ్‌లో (సీమాంధ్రలో) టిడిపి 5.17, వైకాపా 3977, కాంగ్రెసు 139, ఇతరులు 421, వామపక్షాలు 38

జడ్పీటిసీలు - కాంగ్రెసు 1, టిడిపి 334, వైకాపా 231, ఇతరులు 3

తెలంగాణలో కాంగ్రెసు 2311, తెరాస 1884, టిడిపి 1040, ఇతరులు 956, వామపక్షాలు 233

జడ్పీటిసీలు - కాంగ్రెసు 177, టిడిపి 52, తెరాస 191, వామపక్షాలు 4, ఇతరులు 16

ఎంపిపి - కాంగ్రెసు 1

చిత్తూరు జిల్లా - కాంగ్రెసు 1, టిడిపి 335, వైకాపా 227, ఇతరులు 28

జడ్పీటీసీలు - టిడిపి 25, వైకాపా 13

విజయనగరం: కాంగ్రెసు 40, టిడిపి 245, వెకాపా 155, ఇతరులు 20

జడ్పీటీసీలు - టిడిపి 24, వైకాపా 10

కర్నూలు జిల్లా: (815): వైకాపా 390, టిడిపి 339, కాంగ్రెసు 41, ఇతరులు 37

జడ్పీటీసీలు - టిడిపి 4, వైకాపా 7, ఇతరులు 1

విశాఖపట్నం జిల్లా: (656): కాంగ్రెసు 11, టిడిపి 324, వైకాపా 241, వామపక్షాలు 8, ఇతరులు 41

జడ్పీటీసీలు - టిడిపి 24, వైకాపా 12

ప్రకాశం జిల్లా: టిడిపి 358, వైకాపా 386, ఇతరులు 39

జడ్పీటీసీలు - టిడిపి 25, వైకాపా 31

కడప జిల్లా: కాంగ్రెసు 9, వైకాపా 348, టిడిపి 194, ఇతరులు 8

జడ్పీటీసీలు - టిడిపి 12, వైకాపా 30

తూర్పు గోదావరి: కాంగ్రెసు 2, టిడిపి 516, వైకాపా 303, వామపక్షాలు 1, ఇతరులు 51

జడ్పీటీసీలు - టిడిపి 28, వైకాపా 7

పశ్చిమ గోదావరి జిల్లా - కాంగ్రెసు 2, టిడిపి 587, వైకాపా 237, వామపక్షాలు 1, ఇతరులు 64

జడ్పీటిసీ - టిడిపి 43, వైకాపా 2

గుంటూరు జిల్లా: కాంగ్రెసు 4, టిడిపి 469, వైకాపా 409, వామపక్షాలు 5, ఇతరులు 26

జడ్పీటీసీలు - టిజిపి 34, వైకాపా 23

నెల్లూరు జిల్లా: టిడిపి 228, వైకాపా 306, కాంగ్రెసు 15, వామపక్షాలు 7, ఇతరులు 27

జడ్పీటీసిలు - టిడిపి 11, వెకాపా 19

చిత్తూరు జిల్లా: కాంగ్రెసు 3, టిడిపి 431, వైకాపా 333, ఇతరులు 36

జడ్పీటీసీలు - టిడిపి 36, వైకాపా 28 , ఇతరులు 1

అనంతపురం : టిడిపి 506, కాంగ్రెసు 3, వైకాపా 275, వామపక్షాలు 1, ఇతరులు 12

జడ్పీటిసి- టిడిపి 35, వైకాపా 15, ఇతరులు 1

కృష్ణా జిల్లా - కాంగ్రెసు 2, టిడిపి 458, వైకాపా 324, వామపక్షాలు 5, ఇతరులు 26

జడ్పీటీసీలు - టిడిపి 25, వెైకాపా 15

శ్రీకాకుళం జిల్లా - కాంగ్రెసు 7, టిడిపి 359, వెకాపా 270, వామపక్షాలు 2, ఇతరులు 34

జడ్పిటీసిల్లో - కాంగ్రెసు 7, టిడిపి 20, వైకాపా 15

తెలంగాణ జిల్లాల్లో ఇలా...

అదిలాబాద్ జిల్లా - తెరాస 292, కాంగ్రెసు 163, టిడిపి 64, వామపక్షాలు 8, ఇతరులు 109

జడ్పీటీసీలు - కాంగ్రెసు 9, టిడిపి 2, తెరాస 39, ఇతరులు 2

వరంగల్ జిల్లా - తెరాస 234, కాంగ్రెసు 264, టిడిపి 115, వామపక్షాలు 6, ఇతరులు 54

జడ్పీటీసీలు - కాంగ్రెసు 24,టిడిపి 6, తెరాస 18, ఇతరులు 2

నల్లగొండ జిల్లా - కాంగ్రెసు 395, టిడిపి 151, తెరాస 114, వామపక్షాలు 78, ఇతరులు 97

జడ్పీటీసీలు - కాంగ్రెసు 43, టిడిపి 2, తెరాస 13, వామపక్షాలు 1

రంగారెడ్డి జిల్లా - కాంగ్రెసు 221, టిడిపి 127, తెరాస 143, వామపక్షాలు 8, ఇతరులు 114

జడ్పిటీసిలు - కాంగ్రెసు 15, టిడిపి 6, తెరాస 12

ఖమ్మం జిల్లా - టిడిపి 215, కాంగ్రెసు 80, తెరాస 0, వామపక్షాలు 103, ఇతరులు 131

జడ్పీటీసీలు - కాంగ్రెసు 6, టిడిపి 16, వామపక్షాలు 2, ఇతరులు 7

మహబూబ్‌నగర్ జిల్లా - కాంగ్రెసు 365, టీడిపి 174, తెరాస 297, వామపక్షాలు 7, ఇతరులు 126

జడ్పీటీసీలు - కాంగ్రెసు 29, టిడిపి 9, తెరాస 23, ఇతరులు 2

నిజామాబాద్ జిల్లా - కాంగ్రెసు 228, తెరాస 239, టీడిపి 31, వామపక్షాలు 3, ఇతరులు 82

జడ్పీటీసీలు - కాంగ్రెసు 12, తెరాస 24

మెదక్ జిల్లా - కాంగ్రెసు 296, టీడిపి 102, తెరాస 216, ఇతరులు 59

జడ్పీటీసిలు - కాంగ్రెసు 21, టీడిపి 4, తెరాస 21

కరీంనగర్ జిల్లా - తెరాస 349, కాంగ్రెసు 280, టిడిపి 33, వామపక్షాలు 5, ఇతరులు 150

జడ్పిటీసిలు - కాంగ్రెసు 14, టీడిపి 1, తెరాస 41, ఇతరులు 1

ఎంపిటీసి ఎన్నికల్లో మజ్లీస్ బోణీ కొట్టింది. సరూర్ నగర్ మండలం కొత్తపేట నుంచి షాజిదా బేగం విజయం సాధించారు.

ఓట్ల లెక్కింపునకు 15 వేల మంది సిబ్బందిని నియోగించారు. బ్యాలెట్ పత్రాలు వాడడంతో ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగే అవకాశం ఉంది. మంగళవారం అర్థరాత్రి వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. దాదాపు నాలుగు కోట్ల మంది ఓటర్ల నాడి ఓ ఫలితాలతో వెల్లడి కానుంది.

లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైనా లెక్కింపు ప్రారంభం కావడానికి మధ్యాహ్నం పట్టే అవకాశం ఉంది. సిబ్బంది, వసతులను దృష్టిలో పెట్టుకుని లెక్కింపు కేంద్రాల్లో బల్లలను ఏర్పాటు చేశారు. ఒక్కో మండలానికి సంబంధించిన ఓట్ల లెక్కించడానికి పది బల్లలను ఏర్పాటు చేశారు.

ఐదు బల్లలను ఎంపిటీసి, ఐదు బల్లలను జడ్పీటిసి ఓట్ల లెక్కింపునకు వాడుతారు. రౌండ్లవారీగా ఫలితాలు వెలువరిస్తారు. లెక్కింపులో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత బాక్సులు తెరిచి జడ్పీటిసి, ఎంపిటీసి బ్యాలెట్లను వేరు చేస్తారు.

జడ్పీటిసి, ఎంపిటీసిలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+