అక్రమ సంబంధం: భార్యాకూతుళ్లను హత్య చేశాడు
అడివరపు సరస్వతి స్వగ్రామం ఎల్ఎన్పేట మండలం కొవిలాం. వీరికి వివాహమై ఐదేళ్లు కావస్తోంది. భార్యాభర్తలు కొన్నాళ్లు అన్యోన్యంగా కాపురం చేశారు. మొదటి సంతానంగా కుమారుడు అఖిల్ జన్మించాడు. అనంతరం రెండేళ్లకు సరస్వతి మళ్లీ గర్భం దాల్చింది. అయితే గోవిందరావు సరస్వతిపై అనుమానంతో ఆమె కన్నవారింటికి పంపివేశాడు. అక్కడే ప్రవళ్లిక జన్మించింది.
ఏడాది తర్వాత గోవిందరావు కొవిలాం వెళ్లి తన భార్యను తనతో పంపించాలని పెద్ద మనుషులు, అత్తవారిని కోరాడు. దీంతో వారు ఈనెల ఐదో తేదీన పంపించారు. శని, ఆదివారాల్లో భార్యాపిల్లలతో గోవిందరావు సరదాగా గడిపాడు. అయితే ఆదివారం రాత్రి 11 గంటల తరువాత ఎవరూ లేని సమయం చూసి గోవిందరావు తన భార్య సరస్వతి, కుమార్తె ప్రవళ్లిక గొంతులను కత్తితో దారుణంగా కోసి హతమార్చాడు. వెంటనే సరుబుజ్జిలి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు.
తన భార్య, కూతుర్ని తానే చంపానని పోలీసులకు తెలిపాడు. చాలా కాలంగా భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబం ధం ఉన్నదనే నెపంతో కుమార్తె కూడా వారికే పుట్టిందనే అనుమానంతో హతమార్చినట్లు హంతకుడు గోవిందరావు తెలిపాడు. సరస్వతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.