వారితో ఆడుకున్న శిల్పా: అఖిలప్రియ అడగ్గానే చంద్రబాబు..
వైయస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలకు బిక్షాటన తప్పదని, రెండేళ్ల కాలానికి నంద్యాలలో పోటీ చేసి జగన్ ఏం సాధిస్తారో చెప్పాలని మంత్రి ఆదినారాయణ రెడ్డి సోమవారం ఎద్దేవా చేశారు.
నంద్యాల: వైయస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలకు బిక్షాటన తప్పదని, రెండేళ్ల కాలానికి నంద్యాలలో పోటీ చేసి జగన్ ఏం సాధిస్తారో చెప్పాలని మంత్రి ఆదినారాయణ రెడ్డి సోమవారం ఎద్దేవా చేశారు.
ఆటో నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు, ఆదినారాయణ రెడ్డి, అఖిలప్రియ, టిడిపి సీనియర్ నేత కేఈ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జగన్ పైన నిప్పులు చెరిగారు.

పులివెందుల కంటే ఎక్కువ, కుప్పంతో సమానంగా నంద్యాల
ప్రజల సొమ్మును దోచుకొని, దాచుకోవడం తప్ప ప్రజల అభివృద్ధి, సంక్షేమం జగన్కు పట్టదన్నారు. నంద్యాలను పులివెందుల కంటే ఎక్కువగా, కుప్పంతో సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నంద్యాల పట్టణంలో ఎన్నికలు వచ్చే నాటికి రూ.1200 కోట్లు అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. అభివృద్ధి చూసి ప్రజలు ఓటు వేయాలన్నారు.

శిల్పా వారి జీవితాలతో ఆడుకున్నారు
ఆటో నగర్వాసులకు నాలుగు రోజుల్లో రిజిస్ట్రేషన్లు చేపిస్తామని అఖిలప్రియ చెప్పారు. భూమా బ్రహ్మానంద రెడ్డి ఆటోనగర్ను దత్తత తీసుకుుంటారని తెలిపారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు అన్ని పది రోజుల లోపల పూర్తి చేస్తామన్నారు. శిల్పా మోహన్ రెడ్డి పదేళ్లు అధికారంలో ఉండి సమస్యలు పరిష్కరించకుండా నాన్చుడు ధోరణి అవలంబించి ఆటో కార్మికుల జీవితాలతో ఆడుకున్నారన్నారు. స్థానికుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం చేస్తామని కేఈ ప్రభాకర్ చెప్పారు.
Recommended Video


బ్రహ్మానంద రెడ్డిని గెలిపించాలి
నంద్యాల అభివృద్ధి టిడిపితో సాధ్యమని, ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డిని గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ అన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో టిడిపిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

అఖిలప్రియ అడగ్గానే..
మంత్రి అఖిలప్రియ అడిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.కోట్లు మంజూరు చేశారని టిజి వెంకటేష్ తెలిపారు. ఎవరైనా కోరికలు తీరాలంటే టిడిపి ప్రభుత్వం ద్వారానే సాధ్యమన్నారు. కార్మికులు, రైతులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులుగాని టిడిపి ప్రభుత్వాన్ని ఆదరిస్తే మరిన్ని అభివృద్ది కార్యక్రమాలను చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. మద్యం నిషేధిస్తామన్న జగన్ పక్క రాష్ట్రంలో కూడా మద్య నిషేధం లేకుండా చేస్తారా అని పశ్నించారు. ప్రభుత్వానికి ఎంత మేలు చేస్తే ఆదరణ కూడా అంత రెట్టింపు ఉంటుందన్నారు.
-
జగన్కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications