బాబుకు పాదాభివందనం, లోకేష్ క్షమించు: తెరాసలో చేరిన ఎమ్మెల్యే కృష్ణారావు
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో టీడీపీకి నాయకత్వ లోపం ఏర్పడిందని, ప్రజల కోసం తీసుకున్న తన నిర్ణయాన్ని చంద్రబాబు, లోకేష్లు అర్థం చేసుకొని క్షమించాలని తెరాసలో చేరిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన చంద్రబాబుకు పాదాభివందనం అంటూ టీడీపీ కార్యాలయానికి అతను ఓ ఫ్యాక్స్ పంపించారు. తెరాస చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడినై నియోజకవర్గం అభివృద్ధి కోసం తెరాసలో చేరినట్లు వివరణ ఇచ్చారు.
తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకపోవడంతో పేద ప్రజలకు ఎలాంటి సహకారం అందించలేకపోతున్నానని, కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణారావుకు కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.

కృష్ణారావు నివాసాన్ని ముట్టడించిన టీఎన్ఎస్ఎఫ్
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నివాసాన్ని ఆదివారం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ముట్టడించారు. టీడీపీ టిక్కెట్తో గెలిచి, పార్టీకి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణారావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కార్యకర్తల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి, కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణలో శాసనమండలికి సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులను గెలుపించుకునేందుకు తెరాస వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది.
-
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది!












Click it and Unblock the Notifications