సీమాంధ్రుడి చేతిలో ఉద్యమమా?: కెసిఆర్పై మోత్కుపల్లి
తెలంగాణ కెసిఆర్ అబ్బ సొత్తు కాదని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీని కెసిఆర్ విమర్శించే ముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు కాళ్లు పట్టుకొని పైకి వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పునర్నిర్మానం చేస్తానని కెసిఆర్ అంటున్నాడని, ఆయన చేసేది పునర్నిర్మాణమా? లేక పెత్తందార్ల పునర్నిర్మాణమా? అని ప్రశ్నించారు.
నిత్యం ఫాంహౌస్లో ఉండే కెసిఆర్కు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి, నైతిక అర్హత లేవన్నారు. కెసిఆర్ ఆంధ్రా ప్రాంతం నుండి వచ్చిన విషయం మరిచిపోవద్దని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కెసిఆర్ తెలంగాణ రావొద్దని కోరుకుంటున్నారని ఆరోపించారు.
కాంగ్రెసు పార్టీ సీమాంధ్రకు రాజధాని ఎక్కడో ఇప్పటి వరకు చెప్పలేదని, అలాంటి కాంగ్రెసు తీరును ఖండించకుండా తమ పార్టీ పైన కెసిఆర్ దుమ్మెత్తి పోయడమేమిటన్నారు. తెలంగాణ ఏర్పాటును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేత అడ్డుకోజూస్తున్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కెసిఆర్ ఎందుకు విమర్శించడం లేదన్నారు. కెసిఆర్ అమ్ముడుపోయే సరుకన్నారు. కెసిఆర్ పనికిమాలిన, లత్కోరు నాయకుడన్నారు.