ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ఆందోళన... అరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మాఆర్పీఎస్ నాయకులు ఆదివారం నాడు ఆందోళనకు దిగారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ ఎదుట ఆందోళనకు యత్నించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతుదారుగా నిలిచిన ఎమ్మాఆర్పీఎస్, గత కొంతకాలంగా వ్యతిరేకత కనబరుస్తోంది.

ఇక శనివారం నాడు నిజామాబాద్ జిల్లాలో టీడీపీ సర్వసభ్య సమావేశాన్ని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకోవడం... ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరికి నిరసనగా నిజామాబాద్ జిల్లాల్లో బోధన్, నబీపేట్లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోవడంతో నిరసనకు దిగిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు కోపంతో చితకబాదారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు చెందిన వాహనం అద్దాలను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications