3 గంటలకు ముద్రగడ కీలక ప్రకటన, నిఘా ఏమైపోయింది?: బాబు ఆగ్రహం (పిక్చర్స్)
తుని: కాపు ఐక్య గర్జన కార్యాచరణ తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి కిర్లంపూడికి మారింది. ఆదివారం మధ్యాహ్నాం తునిలోని కొబ్బరి తోటల్లో నిర్వహించిన కాపు గర్జనకు హాజరైన లక్షలాది కాపులు కాపు ఐక్య గర్జన అధ్యక్షుడు ముద్రగడ పద్మనాభం ఇచ్చిన రైలు, రాస్తారాకో పిలుపు మేరకు హింసాత్మాక ఘటనలు దిగారు.
ఈ సందర్భంగా జాతీయ రహదారిపై బైఠాయించిన ముద్రగడ పద్మనాభం ప్రయాణికులు అవస్థలను ఎదుర్కొంటున్న క్రమంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో రాస్తారాకో విరమించారు. అనంతరం ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని తన స్వగ్రామమైన కిర్లంపూడికి చేరుకున్నారు.
తాజాగా నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముద్రగడ పద్మనాభం కీలక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడనున్న ముద్రగడ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. సోమవారం సాయంత్రంలోగా కాపులను బీసీల్లో చేరుస్తూ జీవో జారీ చేయాలని ముద్రగడ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
కాపులను బీసీల్లో చేర్చుతూ జీవో జారీ కాకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో కిర్లంపూడిలో ఆయన చేయనున్న భవిష్యత్ కార్యాచరణ ప్రకటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 10 కంపెనీల బెటాలియన్ బలగాలు కొనసీమ, కిర్లంపూడికి చేరుకున్నాయి.
ఇంత కుట్ర జరుగుతుంటే నిఘా ఏమైపోయింది?: బాబు ఆగ్రహం
తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో పరిస్థిని ముందుగా అంచనా వేయడంలో నిఘా వర్గాలు వైఫల్యం చెందాయని చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిఘా వర్గాలతో పాటు పోలీసులు, మీడియా సైతం కుట్ర జరుగుతోందని అంచనా వేయలేకపోయాయని బాబు అభిప్రాయపడ్డారు.
సామాజిక శ్రేయస్సు కోసం తాము ఆలోచిస్తుంటే, కేవలం ఆరేడు వాహనాల్లో వచ్చిన వారు హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. వీళ్లపై పోలీసు చర్యలే ఏకైక మార్గమని అధికారులతో వ్యాఖ్యానించిన చంద్రబాబు, కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.

3 గంటలకు ముద్రగడ కీలక ప్రకటన, నిఘా ఏమైపోయింది?: బాబు ఆగ్రహం
కాపు ఐక్య గర్జన కార్యాచరణ తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి కిర్లంపూడికి మారింది. ఆదివారం మధ్యాహ్నాం తునిలోని కొబ్బరి తోటల్లో నిర్వహించిన కాపు గర్జనకు హాజరైన లక్షలాది కాపులు కాపు ఐక్య గర్జన అధ్యక్షుడు ముద్రగడ పద్మనాభం ఇచ్చిన రైలు, రాస్తారాకో పిలుపు మేరకు హింసాత్మాక ఘటనలు దిగారు.

3 గంటలకు ముద్రగడ కీలక ప్రకటన, నిఘా ఏమైపోయింది?: బాబు ఆగ్రహం
ఈ సందర్భంగా జాతీయ రహదారిపై బైఠాయించిన ముద్రగడ పద్మనాభం ప్రయాణికులు అవస్థలను ఎదుర్కొంటున్న క్రమంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో రాస్తారాకో విరమించారు. అనంతరం ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని తన స్వగ్రామమైన కిర్లంపూడికి చేరుకున్నారు.

3 గంటలకు ముద్రగడ కీలక ప్రకటన, నిఘా ఏమైపోయింది?: బాబు ఆగ్రహం
తాజాగా నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముద్రగడ పద్మనాభం కీలక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడనున్న ముద్రగడ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. సోమవారం సాయంత్రంలోగా కాపులను బీసీల్లో చేరుస్తూ జీవో జారీ చేయాలని ముద్రగడ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

3 గంటలకు ముద్రగడ కీలక ప్రకటన, నిఘా ఏమైపోయింది?: బాబు ఆగ్రహం
కాపులను బీసీల్లో చేర్చుతూ జీవో జారీ కాకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో కిర్లంపూడిలో ఆయన చేయనున్న భవిష్యత్ కార్యాచరణ ప్రకటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 10 కంపెనీల బెటాలియన్ బలగాలు కొనసీమ, కిర్లంపూడికి చేరుకున్నాయి

3 గంటలకు ముద్రగడ కీలక ప్రకటన, నిఘా ఏమైపోయింది?: బాబు ఆగ్రహం
తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో పరిస్థిని ముందుగా అంచనా వేయడంలో నిఘా వర్గాలు వైఫల్యం చెందాయని చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిఘా వర్గాలతో పాటు పోలీసులు, మీడియా సైతం కుట్ర జరుగుతోందని అంచనా వేయలేకపోయాయని బాబు అభిప్రాయపడ్డారు.

3 గంటలకు ముద్రగడ కీలక ప్రకటన, నిఘా ఏమైపోయింది?: బాబు ఆగ్రహం
సామాజిక శ్రేయస్సు కోసం తాము ఆలోచిస్తుంటే, కేవలం ఆరేడు వాహనాల్లో వచ్చిన వారు హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. వీళ్లపై పోలీసు చర్యలే ఏకైక మార్గమని అధికారులతో వ్యాఖ్యానించిన చంద్రబాబు, కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications