Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సర్వే నిజమైంది, యూపిఏ ఇంకెంతకాలమో: లగడపాటి

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఢిల్లీ ఫలితాలపై తన సర్వే నిజమైందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆదివారం అన్నారు. దేశంలో కాంగ్రెసు పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. యూపిఏ 2 ప్రభుత్వం ఇంకెంత కాలం కొనసాగుతుందో చెప్పలేమన్నారు.

తాను చేసిన సర్వే నిజమైందని, కాంగ్రెసు పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి (ఎఎపి) ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. ఎఎపి గుర్తు చీపురు కింద బ్యాట్ ఉండటంతో ఓటర్లు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారని లగడపాటి అన్నారు. కేజ్రీవాల్ విధానానికి శిరస్సు వంచి నమస్కరించాలన్నారు.

నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మన రాష్ట్రంపై పడబోతున్నాయని, రెండుసార్లు అధికారాన్ని ఇచ్చిన ఎపి ప్రజలకు కాంగ్రెసు పార్టీ అన్యాయం చేయడం మంచిది కాదన్నారు. దత్తపుత్రుడి కోసం రాష్ట్రాన్ని విభజించాలని చూడటం మంచిది కాదని మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోరుకునే వారమంతా సోమవారం సమావేశమౌతున్నట్లు చెప్పారు. ఈ ఫలితాలు కాంగ్రెసు పార్టీకి కనువిప్పు కలిగిస్తాయని భావిస్తున్నానన్నారు.

తాను చెప్పిన సర్వేలు నిజమయ్యాయని, కేజ్రీవాల్ పార్టీకి 30 సీట్ల వరకు వస్తాయని చెబితే కొందరు నవ్వారని గుర్తు చేశారు. సామాన్య అభ్యర్థులను పెట్టి ఆయన గెలిపించారని కితాబిచ్చారు. సరైన పార్టీలు, అభ్యర్థులు ఉంటే ఎలాంటి పార్టీనైనా ఓడించవచ్చునని ఢిల్లీ ఫలితాలు రుజువు చేశాయన్నారు. ఎపిలో 63 శాతం మంది కాంగ్రెసుతో సహా ఇతర పార్టీలను వ్యతిరేకిస్తున్నారన్నారు. వందేళ్ల చరిత్ర ఉందని కాంగ్రెసు, మోడీ ఉన్నారని బిజెపి అనుకుంటే లాభం లేదన్నారు.

ఇంకా ఘోర ఫలితాలు: హర్షకుమార్

నాలుగు రాష్ట్రాల ఎన్నికల కంటే ఘోర ఫలితాలను కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో చూడాల్సి వస్తుందని అమలాపురం ఎంపి హర్ష కుమార్ వేరుగా అన్నారు. కాంగ్రెసు పార్టీ పని అయిపోయినట్లేనన్నారు. తాము పదవులకు రాజీనామా చేయమని, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు చేస్తామన్నారు. అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నామన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.గ

సమైక్యంగా ఉంటేనే: శైలజానాథ్

రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మంచిదని మంత్రి శైలజానాథ్ అన్నారు. ఐదుకోట్లకు పైగా మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారన్నారు. నాలుగు రాష్ట్రాల ఫలితాలను తాము స్వాగతిస్తున్నామన్నారు. ఈ ఫలితాలతోనైనా కాంగ్రెసు పార్టీ కళ్లు తెరవాలన్నారు.

జేజమ్మ వచ్చినా ఆపలేరు: ఈటెల

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన జేజమ్మలు వచ్చినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందన్నారు. తెలంగాణను శాసించి, పాలించే పరిస్థితికి తెరాస వస్తుందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+