సర్వే నిజమైంది, యూపిఏ ఇంకెంతకాలమో: లగడపాటి

తాను చేసిన సర్వే నిజమైందని, కాంగ్రెసు పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి (ఎఎపి) ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. ఎఎపి గుర్తు చీపురు కింద బ్యాట్ ఉండటంతో ఓటర్లు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారని లగడపాటి అన్నారు. కేజ్రీవాల్ విధానానికి శిరస్సు వంచి నమస్కరించాలన్నారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మన రాష్ట్రంపై పడబోతున్నాయని, రెండుసార్లు అధికారాన్ని ఇచ్చిన ఎపి ప్రజలకు కాంగ్రెసు పార్టీ అన్యాయం చేయడం మంచిది కాదన్నారు. దత్తపుత్రుడి కోసం రాష్ట్రాన్ని విభజించాలని చూడటం మంచిది కాదని మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోరుకునే వారమంతా సోమవారం సమావేశమౌతున్నట్లు చెప్పారు. ఈ ఫలితాలు కాంగ్రెసు పార్టీకి కనువిప్పు కలిగిస్తాయని భావిస్తున్నానన్నారు.
తాను చెప్పిన సర్వేలు నిజమయ్యాయని, కేజ్రీవాల్ పార్టీకి 30 సీట్ల వరకు వస్తాయని చెబితే కొందరు నవ్వారని గుర్తు చేశారు. సామాన్య అభ్యర్థులను పెట్టి ఆయన గెలిపించారని కితాబిచ్చారు. సరైన పార్టీలు, అభ్యర్థులు ఉంటే ఎలాంటి పార్టీనైనా ఓడించవచ్చునని ఢిల్లీ ఫలితాలు రుజువు చేశాయన్నారు. ఎపిలో 63 శాతం మంది కాంగ్రెసుతో సహా ఇతర పార్టీలను వ్యతిరేకిస్తున్నారన్నారు. వందేళ్ల చరిత్ర ఉందని కాంగ్రెసు, మోడీ ఉన్నారని బిజెపి అనుకుంటే లాభం లేదన్నారు.
ఇంకా ఘోర ఫలితాలు: హర్షకుమార్
నాలుగు రాష్ట్రాల ఎన్నికల కంటే ఘోర ఫలితాలను కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్లో చూడాల్సి వస్తుందని అమలాపురం ఎంపి హర్ష కుమార్ వేరుగా అన్నారు. కాంగ్రెసు పార్టీ పని అయిపోయినట్లేనన్నారు. తాము పదవులకు రాజీనామా చేయమని, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు చేస్తామన్నారు. అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నామన్నారు. కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.గ
సమైక్యంగా ఉంటేనే: శైలజానాథ్
రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మంచిదని మంత్రి శైలజానాథ్ అన్నారు. ఐదుకోట్లకు పైగా మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారన్నారు. నాలుగు రాష్ట్రాల ఫలితాలను తాము స్వాగతిస్తున్నామన్నారు. ఈ ఫలితాలతోనైనా కాంగ్రెసు పార్టీ కళ్లు తెరవాలన్నారు.
జేజమ్మ వచ్చినా ఆపలేరు: ఈటెల
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన జేజమ్మలు వచ్చినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందన్నారు. తెలంగాణను శాసించి, పాలించే పరిస్థితికి తెరాస వస్తుందన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications