వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్యాన్‌కు కరెంట్ ఇస్తున్నారు: జగన్, కాంగ్రెస్‌పై లోకేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nara Lokesh
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సామాజిక వెబ్ సైట్ ట్విట్టర్‌లో మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికార కాంగ్రెసు పార్టీ ఫ్యానుకు కరెంట్ ఇస్తూ, కారుకు డీజిల్ పోస్తోందంటూ ట్వీట్ చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల గుర్తు కారు.

ఈ నేపథ్యంలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల పైన ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు అధికార పార్టీ పూర్తిస్థాయిలో మద్దతిస్తోందన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు బెయిల్ కోసం, కాంగ్రెసులో విలీనం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో తమ పార్టీ నాయకులు మాత్రం రాష్ట్రపతిని, జాతీయ నాయకులను కలిసి తెలుగు ప్రజల సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటాడుకుంటోందన్నారు.

కాగా, నారా లోకేష్ గత కొంతకాలంగా రాష్ట్రంలోని పలు అంశాల పైన ట్విట్టర్‌లో స్పందిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీల పైన ఆయన ట్విట్టర్‌లో విమర్శలు చేస్తున్నారు. ఇటీవల తన తండ్రి ట్విట్టర్ అకౌంట్ తీసుకున్నప్పుడు ఆహ్వానం పలికారు.

English summary

 While YCP & TRS visit Delhi for bail & mergers, our leader will ask the President to intervene & find a solution for the plight of Telugus, tweeted Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X