తెలంగాణ తథ్యం, పరిష్కరిస్తాం: మళ్లీ తేల్చి చెప్పిన షిండే

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో సుశీల్ కుమార్ షిండే సోమవారం సాయంత్రం ఐదు గంటలకు భేటీ కానున్నారు. ఈ భేటీలో ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితులపై చర్చించనున్నారు. విభజన నిర్ణయం తదనంతర పరిణామాలు వారి మధ్య చర్చకు రానున్నాయి.
గడపగడపకు కాంగ్రెసు
తెలంగాణకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం అనుకూలంగా నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఏర్పాటుకు వేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు గడపగడపకు కాంగ్రెసు కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
అలాగే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోని బోదన్, నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్టలో మొదటి విడతగా సభలు పెట్టాలని భావిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటలకు జానా రెడ్డి నివాసంలో తెలంగాణ నేతలు భేటీ కానున్నారు.












Click it and Unblock the Notifications