ఏపీలో మే నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు, వడగాలులతో జాగ్రత్త, నార్మల్ టెంపరేచర్
విశాఖపట్నం: మార్చి, ఏప్రిల్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. అయితే, మే నెలలో మాత్రం ఎండలతోపాటు సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదువుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. మే నెలలో ఉష్ణోగ్రతలు కూడా సాధారణంగానే ఉంటాయని వెల్లడించింది. యానాంలో కూడా ఇవే పరిస్తితులు కొనసాగుతాయని తెలిపింది.

మేలో ఏపీ, యానాంలలో సాధారణ ఉష్ణోగ్రతలు, వర్షపాతం ఎక్కువే
ఐఎండీ ఏపీ డైరెక్టర్ ఎస్ స్టెల్లా మాట్లాడుతూ.. మే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు భారతదేశంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయని, అయితే, వర్షాలు మాత్రం సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని తెలిపారు. మే నెలలో ఏపీతోపాటు యానాంలలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందన్నారు. ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదయ్యే అవకాశం లేదని తెలిపారు. అంతేగాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని ఐఎండీ ఏపీ డైరెక్టర్ తెలిపారు.
Recommended Video


ఏపీలో వడగాలలు.. పిల్లలు, వృద్ధులు జాగ్రత్త
మరోవైపు, రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 553 మండలాల్లో వడగాలులు, 114 మండలాల్లో వేడి వాతావరణం ఉంటుందని వెల్లడించారు. పిల్లలు, వృద్ధులు పగటిపూట అంటే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రావొద్దని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ హెచ్చరించింది.
మరోవైపు, ఐఎండీ నివేదించిన ప్రకారం.. వాయువ్య, మధ్య భారతదేశంలో 1900 నుంచి ఏప్రిల్లో అత్యధిక సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలోనూ వాతావరణం ఇలాగే కొనసాగనుంది.

భారతదేశంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు
ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ.. దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాలు మేలో వేడి రాత్రులను అనుభవించే అవకాశం ఉందని చెప్పారు. పశ్చిమ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో 50ºC కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడాన్ని ఆయన తోసిపుచ్చలేదు.మహపాత్ర చెప్పిన ప్రకారం.. ఏప్రిల్లో భారతదేశంలో సగటు ఉష్ణోగ్రతలు 35.05ºగా నమోదయ్యాయి, 1900లో వాతావరణ కార్యాలయం వాతావరణ డేటాను ఉంచడం ప్రారంభించిన తర్వాత ఇది నాల్గవ అత్యధికం. మార్చి, ఏప్రిల్లలో అధిక ఉష్ణోగ్రతలు "నిరంతరంగా తక్కువ వర్షపాతం కార్యకలాపాలు" కారణమని ఆయన చెప్పారు.

దేశ వ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం
బలహీనమైన పాశ్చాత్య అవాంతరాల కారణంగా చాలా తక్కువ వర్షాలతో, వాయువ్య, మధ్య భారతదేశం 122 సంవత్సరాలలో ఏప్రిల్లో అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేసింది. సగటు గరిష్ట ఉష్ణోగ్రత వరుసగా 35.9ºC, 37.78ºC తాకింది. వాయువ్య, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు తీవ్ర ఆగ్నేయ ద్వీపకల్పంలో మేలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మోహపాత్ర చెప్పారు. దీంతో ఉష్ణోగ్రతలు 45-50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.












Click it and Unblock the Notifications