నెల్లూరు జిల్లాలో బయటపడ్డ 445ఏళ్ల నాటి రాతి శాసనం..
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చేడిమాలలో 1572 నాటి తెలుగు శాసనం ఒకటి బయటపడింది. భారత పురావస్తుశాఖ అధికారి ఎం.యేసుబాబు, వెంకటగిరికి చెందిన చరిత్రకారుడు షేక్ రసూల్ అహ్మద్ దీన్ని గుర్తించారు.
వెంకటగిరి: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చేడిమాలలో 1572 నాటి తెలుగు శాసనం ఒకటి బయటపడింది. భారత పురావస్తుశాఖ అధికారి ఎం.యేసుబాబు, వెంకటగిరికి చెందిన చరిత్రకారుడు షేక్ రసూల్ అహ్మద్ దీన్ని గుర్తించారు.
గత వారం రోజులుగా తాము జిల్లాలో చరిత్ర మూలాలపై పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. ఇదే క్రమంలో చిల్లకూరు మండలం చేడిమాలలో పురాతన ఈశ్వరాలయం వెనుక భాగంలో ముళ్ల పొదల మధ్య రాతి శాసనం బయటపడిందని తెలియజేశారు.

ఈశ్వారాలయం వెనుక బయటపడ్డ ఈ పురాశాసనం 6 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పుతో 21 వరుసలు ఉందన్నారు. చేడిమాల చెరువుకు సంబంధించిన శాసనంగా దీన్ని గుర్తించారు. శాలివాహన శకర్షము, జయ సంవత్సరంలో రాజైన ముద్దుకృష్ణమనాయునికి పుణ్యముగా కొప్పూరి వీరమురసయ్య చేడిమాలలో చెరువును తవ్వించిన సందర్భంలో ఈ శాసనం చేయించినట్టు చెబుతున్నారు.
ఆ సమయంలో మాన్యాలను కేటాయిస్తూ గ్రామ అధికారి పర్యవేక్షణలో చెరువును తవ్వించినట్టుగా పురావస్తు అధికారి యేసుబాబు వివరించారు. దుగరాజపట్నం, వెంకటగిరి ప్రాంతాలకు అప్పట్లో ఈ పట్టణమే కూడలిగా వర్దిల్లిందని, ఇక్కడ ప్రాచీన కట్టడాలను చూస్తే ఆ విషయం అర్థమవుతోందని అన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications