ట్రాలీతో ఢీ: ఇద్దరు 'లగ్జరీ' డ్రైవర్లు మృతి (పిక్చర్స్)
నల్గొండ: నల్గొండ జిల్లాలో జరిగిన ఓ బస్సు ప్రమాదంలో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు మృతి చెందారు. ఆగిన ట్రాలీ లారీని, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు, నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదం జాతీయరహదారి-65పై శనివారం తెల్లవారుజామున ఆకుపాముల సమీపాన జరిగింది.
కాకినాడ నుంచి 30 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు వెళుతున్న సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు వెళ్తోంది. ఆకుపాముల సమీపాన రహదారిపై ట్రాలీ, లారీ ఇండికేటర్ లేకుండా ఆగి ఉండటంతో దానిని ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుర్తించకలేదు. ఢీకొట్టాడు.
దీంతో ఆర్టీసీ బస్సు కేబిన్లో, నిలిచి ఉన్న ట్రాలీలారీ భాగం దూసుకపోయింది. ఈ ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ టీవీఎస్ మూర్తి (50), అదనపు డ్రైవర్ వికె లింగం(40) బస్ కేబిన్లో ఇరుక్కుపోయి మృతి చెందారు.
ప్రమాదం
30 మంది ప్రయాణికులలో ఏలూరుకు చెందిన పుష్పవందన, ఆమె భర్త దేవీప్రసాద్, తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన పి మహేష్బాబు, వి శ్రీనులకు తీవ్రగాయాలైయ్యా యి.
ప్రమాదం
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో కోదాడకు తరలించగా, మృతదేహాలను కూడా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం
ఆగి ఉన్న ట్రాలీ లారీ డ్రైవర్ రహదారిపై ఇండికేటర్ లైట్ వేయకుండా నిర్లక్ష్యం చేయడంతోనే ఈప్రమాదం జరిగిందని ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు వాపోయారు.
ప్రమాదం
ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. ఆర్టీసీ డ్రైవర్లు మృతి చెందడంతో కోదాడ ఆర్టీసీ డ్రైవర్స్ కోదాడ ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకొని మృతదేహాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంపై మునగాల ఎస్ఐ రామకృష్ణా రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.