'రికార్డ్ బద్దలు కొట్టేందుకే హైదరాబాద్ వచ్చా' (పిక్చర్స్)
హైదరాబాద్: పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చునని నిరూపిస్తూ, నేటి యువతలో స్ఫూర్తి నింపుతున్నారు ప్రముఖ అల్ట్రా రన్నర్ అరుణ్ భరద్వాజ్.
హైదరాబాదు రన్నర్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు హైటెక్స్లో ప్రారంభమైన ట్రెడ్ మిల్ పైన 24 గంటల రన్నింగ్ శనివారం ఐదు గంటల వరకు కొనసాగింది. 171.08 కి.మీ.పూర్తి చేశాడు.
ఈ సందర్భంగా అరుణ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో 2007లో ట్రెడ్ మిల్ పైన వంద మైళ్ల (దాదాపు 164 కి.మీ.) పరుగును 24 గంటల్లో పూర్తి చేశానని చెప్పాడు.
అరుణ్ భరద్వాజ్
ఇక్కడ హైదరాబాదులో ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు వచ్చానని, దీనిని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుకు పంపించనున్నట్లు తెలిపారు.
అరుణ్ భరద్వాజ్
యూరప్లో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలోల 52 రోజుల్లో 31వేల మైళ్లు పరుగెత్తాలనేది తన లక్ష్యమని ఆయన తెలిపాడు.
అరుణ్ భరద్వాజ్
అదేవిధంగా 48 గంటల ట్రెడ్ మీల్ పైన రన్న చేయాలనేది తన సంకల్పమని చెప్పాడు. 45 ఏళ్ల వయస్సులో కూడా తను శాఖాహారే కాకుండా.. కార్యాలయానికి రన్నింగ్ చేసుకుంటూనే వెళ్తానని చెప్పాడు.
అరుణ్ భరద్వాజ్
పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చునని నిరూపిస్తూ, నేటి యువతలో స్ఫూర్తి నింపుతున్నారు ప్రముఖ అల్ట్రా రన్నర్ అరుణ్ భరద్వాజ్.