ఆలోచనలోపడ్డ జగన్, పాపాయితో చిరునవ్వు (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని, సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. బుధవారం జగన్ దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ఆయనను పరీక్షించారు.
వైయస్ జగన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని డాక్టర్లు చెప్పారు. షుగర్ లెవల్స్ క్రమంగా తగ్గుతున్నాయని, 58 శాతానికి పడిపోయాయని, బిపి 130/80, పల్స్ రేటు 70గా ఉందని తెలిపారు. జగన్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. ఆయనకు వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే వైద్యుల సూచనను జగన్ తిరస్కరించారు.
జగన్ 1
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథావిథిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ లోటస్ పాండులో దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓ మహిళ సంఘీభావం.
జగన్ 2
రాష్ట్ర విభజనను నిరసిస్తూ లోటస్ పాండులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమరణ దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు తరలి వచ్చిన ముస్లిం మహిళలు.
జగన్ 3
రాష్ట్ర విభజనను నిరసిస్తూ లోటస్ పాండులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమరణ దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు తరలి వచ్చిన కార్యకర్తలు.
జగన్ 4
రాష్ట్ర విభజనను నిరసిస్తూ లోటస్ పాండులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ జగన్.
జగన్ 5
రాష్ట్ర విభజనను నిరసిస్తూ లోటస్ పాండులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి. దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ప్రజలను చూస్తూ సాలోచనలో మునిగిపోయిన జగన్.
జగన్ 6
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండులో దీక్ష చేస్తూ నమస్కరిస్తున్న దృశ్యం.
జగన్ 7
లోటస్ పాండులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ పసిపాపను ఎత్తుకొని చిరునవ్వు చిందిస్తున్న దృశ్యం.
జగన్ 8
విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ దీక్ష చేస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు వచ్చిన ఓ ముస్లిం మహిళ దట్టి కడుతున్న దృశ్యం.