సీఆర్డీఏ రద్దు చట్టంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశం హీట్ను పెంచుతోంది. సోమవారం రోజున సీఆర్డీఏ రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. సీఆర్డీఏ రద్దు చట్టంను వ్యతిరేకిస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్డీఏపై రద్దు చట్టం పై హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. ఏపీ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుపై మధ్యంతర స్టే ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఇక పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం, ఏపీ సీఎం, మంత్రులను ప్రతివాదులుగా చేర్చడం జరిగింది.
అమరావతి రాజధాని రైతులు రాజధానిని తరలించడంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను హైకోర్టు బుధవారం విచారణ చేయనుంది. ఏపీ రాజధానిగా ముందుగా నిర్ణయించినట్లుగా అమరావతే ఉండాలని పిటిషన్లో 37 మంది రైతులు కోర్టును కోరారు. మరోవైపు మూడు రాజధానుల తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి జేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు గుంటూరు కృష్ణా జిల్లాల్లో స్వచ్ఛదంగా బంద్ కొనసాగుతోంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. మూడు రాజధానుల నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కు తగ్గేవరకు పోరాటం ఆగదని విద్యార్థి నేతలు చెప్పారు.

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులపై బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేయించాలన్న ఉద్దేశంతో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మూడురోజుల పాటు నిర్వహిస్తోంది. సోమవారం సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి సుదీర్ఘ చర్చ తర్వాత శాసనసభ ఆమోదం తెలిపింది. అయితే మండలిలో మాత్రం ప్రభుత్వంకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఇక మండలిలో ఈ రోజు కూడా చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఇక మండలిలో బిల్లును అడ్డుకునేందుకు టీడీపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం ద్వారా మూడు నెలల పాటు అడ్డుకోవచ్చే వ్యూహంతో టీడీపీ వ్యవహరిస్తోంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications