త్వరగా ఇచ్చేద్దాం!: రాజధానికి భూములిచ్చిన రైతులకు శుభవార్త
అమరావతి: రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాజధాని నగర సలహా కమిటీ నిర్ణయించింది. ఆదివారం నాడు సచివాలయంలో మంత్రి పి నారాయణ అధ్యక్షతన జరిగిన సలహా కమిటీ సమావేశానికి సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు.. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వీలైనంత త్వరగా లే అవుట్లు వేసి అభివృద్ధి చేసి ప్లాట్లను తిరిగి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. రాజధానిని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న విషయమై కమిటీ పలు అంశాల పైన చర్చించింది.

ఈ సమావేశానికి కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు, జీఎంఆర్ గ్రూపు ప్రతినిధి బొమ్మిడాల శ్రీనివాస్, నూజివీడు సీడ్స్ ఎం ప్రభాకర రావు, పీపుల్ కేపిటల్ సీహెచ్ శ్రీనివాసరాజు తదితరులు హాజరయ్యారు.
రాజధాని ప్రాంతం బృహత్ ప్రణాళికలోని అంశాలను సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ వివరించారు. రాజధాని ప్రాంతం బృహత్ప్రణాళిక రాజధాని అవసరాలు తీర్చేలా ఉందా? ఇందులో ఏమైన సవరణలు చేయాలా? అన్న విషయాలను కమిటీ సభ్యులు చర్చించారు. ప్రధాన రాజధాని ప్రాంతం నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వారం పదిరోజులకొకసారి కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు.
-
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications