త్వరగా ఇచ్చేద్దాం!: రాజధానికి భూములిచ్చిన రైతులకు శుభవార్త
అమరావతి: రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాజధాని నగర సలహా కమిటీ నిర్ణయించింది. ఆదివారం నాడు సచివాలయంలో మంత్రి పి నారాయణ అధ్యక్షతన జరిగిన సలహా కమిటీ సమావేశానికి సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు.. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వీలైనంత త్వరగా లే అవుట్లు వేసి అభివృద్ధి చేసి ప్లాట్లను తిరిగి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. రాజధానిని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న విషయమై కమిటీ పలు అంశాల పైన చర్చించింది.

ఈ సమావేశానికి కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు, జీఎంఆర్ గ్రూపు ప్రతినిధి బొమ్మిడాల శ్రీనివాస్, నూజివీడు సీడ్స్ ఎం ప్రభాకర రావు, పీపుల్ కేపిటల్ సీహెచ్ శ్రీనివాసరాజు తదితరులు హాజరయ్యారు.
రాజధాని ప్రాంతం బృహత్ ప్రణాళికలోని అంశాలను సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ వివరించారు. రాజధాని ప్రాంతం బృహత్ప్రణాళిక రాజధాని అవసరాలు తీర్చేలా ఉందా? ఇందులో ఏమైన సవరణలు చేయాలా? అన్న విషయాలను కమిటీ సభ్యులు చర్చించారు. ప్రధాన రాజధాని ప్రాంతం నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వారం పదిరోజులకొకసారి కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు.
-
ఏం చేస్తున్నారు, ఇక సిద్దంగా ఉండండి - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
దంచి కొడుతున్న ఎండల వేళ భారీ వర్షాలు, ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఫీజల నియంత్రణపై కేబినెట్ కీలక నిర్ణయం..!! -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..!












Click it and Unblock the Notifications