ఇంఛార్జి డిజిపిగా ప్రసాద రావు నియమిస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్: రాష్ట్ర ఇంఛార్జి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిజిపి)గా ప్రసాద రావును నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పర్మినెంట్ డిజిపి కోసం యూపిఎస్సీ నుంచి నియామక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అప్పటి వరకు ఇంఛార్జిగా ప్రసాద రావు బాధ్యతలు నిర్వహిస్తారు.
దినేష్ రెడ్డి ఈ రోజు డిజిపిగా పదవీ విరణ చేసిన విషయం తెలిసిందే. దినేష్ రెడ్డి తర్వాత ప్రసాద రావు సహా పలువురి పేర్లు లిస్టులో ఉన్నాయి. అందులో ప్రసాద రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఆయననే ప్రభుత్వం ఇంఛార్జి డిజిపిగా నియమించింది.

1979 ఐపిఎస్ బ్యాచ్కు చెందిన ప్రసాద రావు ప్రస్తుతం ఆయన ఎసిబి డిజిగా పని చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ సిపిగా ఆయన పని చేశారు. ఆయన పదవీ విరమణకు మరో రెండేళ్ల సమయం ఉంది. సోమవారం ఉదయం ప్రసాద రావు సిఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు.
గుంటూరు జిల్లాకు చెందిన ప్రసాద రావు తొలి ప్రయత్నంలోనే ఐపిఎస్కు ఎంపికయ్యారు. కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో ఎస్పీగా, విశాఖ సిపిగా, ఏలూరు, కర్నూలు డిఐజిగా పని చేశారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications