ఆస్పత్రి నుంచి పరారైన ఖైదీ అరెస్ట్ (ఫొటోలు)
విశాఖపట్నం: ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ, వైద్యం నిమిత్తం కెజిహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న ఖైదీని వన్ టౌన్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ ఏసిపి రమణ తెలిపారు.
అనంతగిరి మండలం చిలకగెడ్డ పంచాయతీ కిత్తయ్యతోట గ్రామానికి చెందిన గలపర్తి సన్యాసిరావు 2013లో ఒక హత్య కేసులో నిందితుడు. కేసు విచారణలో భాగంగా అదే ఏడాది డిసెంబర్ 28న రిమాండ్కు తరలించారు. అప్పటి నుంచి రిమాండ్లో ఉన్న సన్యాసిరావు మార్చి 7న అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం కెజిహెచ్లోని రాజేంద్రప్రసాద్ వార్డులో గల ఖైదీల చికిత్స విభాగానికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతున్న సన్యాసిరావు ఆదివారం ఉదయం 6గంటల ప్రాంతంలో బాత్రూంలోని కిటికీ ఊసలను యాక్షా బ్లేడుతో కోసి తప్పించుకున్నాడు. దీనిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ ఆదేశాల మేరకు నాలుగు పోలీస్ బృందాలు నిందితుడి కోసం గాలింపు చేపట్టాయి. సన్యాసిరావును తన స్వగ్రామం కిట్టయ్యతోటలో సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.