డిసెంబర్ 8న పులిచింతల జాతికి అంకితం: పార్థసారథి
విజయవాడ: కృష్ణా నదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టును వచ్చేనెల 8న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి జాతికి అంకితం చేస్తారని మంత్రి పార్థసారథి ప్రకటించారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.
కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంతో కృష్ణా డెల్టా రైతులకు కొంత ఉపశమనం లభిస్తుందన్నారు.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని కంచికచర్ల లేదా గన్నవరం ప్రాంతానికి తరలించనున్నట్లు మంత్రి చెప్పారు.

విజయవాడలో రూ.123 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి అనుమతి లభించిందని, ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు వచ్చాయన్నారు. వచ్చే నెల 8న ఆస్పత్రి శంకుస్థాపన జరుగుతుందని మంత్రి చెప్పారు.
వచ్చే నెల 3వ తేదీన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర శాసనసభా సమావేశాల తేదీలను ఈ మంత్రి వర్గ సమావేశంలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే పులిచింతల ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications