చంద్రబాబు తో బాబా రాందేవ్ భేటీ : మెగా ఫుడ్ పార్క్ కు 172 ఎకరాలు..
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తో యోగా గురు బాబా రాందేవ్ భేటీ అయ్యారు. ఏపిలో తమ ప్రాజెక్టు అంశం పై సీయం తో చర్చించారు. గతంలోనే ఏపిలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు బాబా రాందేవ్ ముందుకొచ్చారు. విజయనగరం జిల్లాలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటికే ఏపి ప్రభుత్వం ఈ సంస్థ కోసం 172.84 ఎకరాల భూమి కేటాయించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు తో యోగా గురు బాబా రాందేవ్ సచివాలయంలో భేటీ అయ్యారు. విజయనగరం జిల్లా చిన్నరావుపల్లిలో పతంజలి సంస్థ ఏర్పాటు చేసే 'మెగా ఫుడ్ పార్క్'పై సీఎంతో ఆయన చర్చించారు. మెగాఫుడ్ పార్క్ గురించి చంద్రబాబుకు రాందేవ్ వివరించారు. రూ.634 కోట్ల వ్యయంతో ఆహారశుద్ధితో పాటు అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేస్తామని సీఎంకు వివరించారు. ఈ పార్క్తో 33,400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. దీంతో... ఈ మెగాఫుడ్ పార్క్కు 172.84 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడి లేని వ్యవసాయాన్ని ప్రోత్సహం కోసం అమలు చేస్తున్న విధానాల ను వివరించారు.

-
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications