నాపై అత్యాచారయత్నం చేశాడు: మెడికో ఫిర్యాదు, గతంలో స్నేహితులే!
విజయవాడ: బెజవాడలో మెడికో అమ్మాయి పైన అత్యాచారయత్నం జరిగింది! తన పైన అత్యాచారయత్నం చేశాడని ఆరోపిస్తూ ఓ మెడికో పడమపట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో సదరు నిందితుడు అమ్మాయి వద్దకు వచ్చి అత్యాచారయత్నం చేశాడని తెలుస్తోంది. అయితే, రాత్రి నుంచి కేసు పెట్టవద్దని మెడికో అమ్మాయి పైన పలువురు ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. చివరకి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరోవైపు, పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు చేసిన అమ్మాయి, ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్బాయి స్నేహితులు. వీరిద్దరు గతంలో కలిసి తిరిగారని, అయితే ఇప్పుడు వీరి మధ్య ఏమైనా ఇతర గొడవలు ఉన్నాయా అనే కోణంలోను పోలీసులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.
రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య
పశ్చిమ గోదావరి ఏలూరు రైల్వే ఫ్లై ఓవర్ వద్ద రైలు కిందపడి ఆదివారం ఉదయం వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆమె పెదపాడు మండలం పాత ముప్పర్రుకు చెందిన శ్వేతగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. శ్వేతకు రమేష్ అనే వ్యక్తితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆదివారం ఉదయం గుడికి వెళ్లివస్తానని చెప్పి బయటకు వచ్చింది.












Click it and Unblock the Notifications