స్పీడ్ అందుకోనున్న రాజధాని నిర్మాణం : నాలుగేళ్లకు ఎంత కేటాయించారంటే!
విజయవాడ : నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా నిర్మించాలనే ఉద్దేశ్యంతో.. వచ్చే పదేళ్లలో ఇందుకోసం భారీగా నిధులను ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం. రాజధాని నిర్మాణంపై బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులు సలే కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాజధాని నిర్మాణాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇందుకు తగ్గట్లుగానే వచ్చే పదేళ్లలో 43వేల కోట్ల రూపాయలను రాజధాని కోసం ఖర్చు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుండగా.. నాలుగేళ్ల కాలానికి గాను 32,500 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణం కోసం వెచ్చించనున్నట్లు అధికారులు తెలిపారు.
కేటాయించిన డబ్బుతో రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా.. ఇళ్లు, రోడ్లు, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, లాంటి సదుపాయాలను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిలకలు రచిస్తోంది.